అధ్యాయం 99

నా స్వర్గం నెంబర్ 477
(Find final)

అవును ఎవరికైనా ఈ గ్రంథము చదివితే అదే విధంగా అర్థం అయితే ఒక సందేహం తప్పకుండా వస్తుంది. అది ఏమిటంటే ఈ విశ్వం అంతా విశ్వ సృష్టి అంతా కూడా ఒక రికార్డు దృశ్యమని ఒక కల అని అది కూడా నిజము లాంటి కలని కలలాంటి నిజం అని చెప్పినప్పుడు మరి మీరు ఎలా సాధన చేశారు అంటే చెప్పిన ఈ గ్రంథములోని సాధన అనుభవాలు కూడా కలలోనే భాగమేనా లేదా సత్యమా అనే సందేహం రావచ్చు. దీనికి సమాధానమే ఈ అధ్యాయము. నిజానికి నేను అలాగే జిఙ్ఞాసి పాత్రధారి ఈ గ్రంథంలో చెప్పిన విధంగా ఈ జన్మలో సాధన చేయలేదు. మేమిద్దరం కూడా అందరి మనుషులు లాగానే సాధారణ జీవితం గడుపుతూ ఉన్నాము. సాధన కోసం ఎక్కడికి వెళ్ళలేదు. సన్యాసులుగా మారలేదు. ఎవర్ని వదిలిపెట్టలేదు. దేనిని వదలలేదు. జిఙ్ఞాసి ఒక పెద్ద కంపెనీలో నెలకు లక్ష సంపాదిస్తూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ గా ఉంటే నేను రచయితగా గుర్తింపు పొందే పనిలో ఉన్నాను. అంటే భోగ జీవితంలో మేము ఇద్దరం చక్కగా ఉంటూ అన్నిటినీ సంతోషంగా ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాము.మరి గ్రంథంలో మీరిద్దరూ చేసిన సాధన జీవితము ఇప్పటిది కాదా? అంటే కాదు అని చెప్పాలి. అవును. నేను చెబుతున్నది పచ్చి నిజమే. మీరు నమ్మలేని నిజమే. నా బొందా. నా బూడిద.నేను ఏ పరమహంసను కాను. అలాగే మన జిఙ్ఞాసి ఏ నంద సరస్వతి కాదు. కేవలం సాధారణ మనుష్యులమే. అది ఏమిటి? ఈ గ్రంథంలో మీరు వ్రాసిన అన్ని రకాల సాధన అనుభవాలు నిజము కానప్పుడు వాటిని ఎందుకు వ్రాసినారు. మమ్మల్ని పిచ్చివాళ్ళని చేయటానికా? ఈ మీ అనుభవాల నిజమని అనుకుని ఇన్నాళ్ళు మేమంతా భ్రమలో ఉన్నామా? మమ్మల్ని మాయ చేసినారా? అసలు ఏం జరుగుతోంది? ఒకపక్క మీరు భోగ జీవితం అనుభవించిన సాధారణ స్థితిలో ఉన్నారని అంటున్నారు? మరి మీరు రాసిన గ్రంథంలోని సాధన అనుభవాలు చూస్తే ఒక నిజ సాధకుడికి వచ్చే అన్ని రకాల అనుభవాలు పూస గుచ్చినట్లుగా నిజ సత్య అనుభవాలకి చాలా దగ్గరగా ఉన్నాయి కదా. ఇది ఎలా సాధ్యం. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాని అయోమయం స్థితిలో మమ్మల్ని ఉంచినారు. ఇప్పటికైనా చెప్పండి. అంటే నేను చెబుతున్నది నిజమే. మేము ఇద్దరం పక్కా భోగ జీవితంలోనే ఉన్నాము. మేము ఏనాడు కాషాయం ధరించలేదు. సన్యాసము తీసుకోలేదు. ఎలాంటి సాధన స్థితిని పొందలేదు. ఇది పక్కా నిజం. మమ్మల్ని చూస్తే ఈ గ్రంథంలో రాసిన అనుభవాలు మా ఇద్దరివేనని మేమే మాకు మేమే నమ్మలేని స్థితిలో ఉన్నాము అంటే మీరే ఆలోచించండి.

అదే మా పరిస్థితి. మా స్థితి. అదేంటి స్వామి? ఇదే ఇదేమీ ట్విస్టు? విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంటే మేము ఏమీ మీకు సమాధానం చెప్పలేని స్థితి. ఒకటి నిజం. అది ఏమిటంటే ఈ విశ్వసృష్టియే ఒక కల అయినప్పుడు కల ప్రపంచం అయినప్పుడు అందులోని మా పిసరంత సాధన కూడా కలయే అవ్వాలి కదా. అవును కల అవుతుంది కదా. ఖచ్చితంగా అవుతుంది. మరి ఈ గ్రంథ రచన కూడా కలయే కదా. అంటే మా సాధన అనుభవాలు అన్ని కూడా కల లాంటి నిజమని నిజం లాంటి కలయని ఈ లెక్కన తెలుస్తుంది కదా. అంటే ఈ లెక్కన గ్రంథములోని సాధన అనుభవాలు నిజమే కదా. కానీ ఇవి ప్రస్తుతం మన యొక్క అనుభవాలు కాదని గ్రహించండి. మా గత జన్మలో రికార్డు అయిన సాధన దృశ్యములను మేము మా కలలో చూసినాము అన్నమాట. అనగా నిద్ర మెలుకువ కాని స్థితిలో ప్రస్తుత జన్మలో సాధన చేస్తూ అనగా యోగ నిద్రపోతూ మా ధ్యానములో మా ఇద్దరి సూక్ష్మ శరీరాలను మా సాధన కల ప్రపంచములోనికి పంపించి అనగా మా గత జన్మల సాధన కలలోనికి మా సూక్ష్మ శరీర యానం జరిగిందని గ్రహించండి. అప్పుడు మాకు అక్కడ కనపడిన దైవిక వస్తువుల ఆకారాలు మాకు కలిగిన అనుభవాలు అప్పుడు మాకు ఎదురైన గురువులు నామ రూప దైవాలు అన్నీ గుర్తుపెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళం. అప్పుడు యోగ నిద్ర లేచిన తర్వాత మా స్థూల శరీరానికి ఈ అనుభవాలు ఈ వస్తువుల వివరాలు తన మెదడులో గుర్తుకు వచ్చేవి. ఆయా సాధన జన్మలో మేము సాధించి అర్థవంతంగా చనిపోయినప్పుడు అలాగే మాకు స్పురణకు వచ్చిననాటి ధ్యాన అనుభవాలు నా డైరీలో నింపడం మొదలుపెట్టాము. మాకు తెలిసిన ఈ దైవిక వస్తువులు అంటే గత జన్మలో మేము సాధించిన దైవిక వస్తువులు ఏయే ప్రాంతాల్లో ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో నేను మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసికి చెపితే వాడు నామీద భక్తి విశ్వాసాలను ఉంచి ఆయా క్షేత్రాలకు వెళ్లి మా గతజన్మల దైవిక వస్తువులు వాడే గుర్తుపట్టి తీసుకురావటం… దానికి ప్రకృతి సంతోషించి ఇది నిజమేనని మాకు ధ్యాన అనుభవాలు ఇవ్వటము ప్రస్తుత జన్మలో జరిగినది అని గ్రహించండి. 

 
అంటే ఈ ప్రస్తుత జన్మలో మీరు మీ గత జన్మ దైవిక వస్తువులు అది కూడా కలలో ప్రయాణం చేసి గత జన్మల అనుభవాలు అక్కడ మీకు కనపడిన దైవిక వస్తువులు ప్రస్తుత జన్మలో దక్కించుకున్నారని కదా మీరు చెబుతున్నది. నమ్మ మంటారా. ఎవరైనా ఎక్కడైనా కలలోనికి ప్రయాణం చేయగలరా? అది కూడా వెనక్కి గతజన్మల దగ్గరకి. అసలు నమ్మటానికి సాధ్యంగా ఉందా? మళ్లీ కొత్త కథలు అల్లుతున్నారా అని మీరు అంటున్నారంటే ఇది నిజమని మా ఇద్దరి సమాధానం కలలోని కి వెళ్లడం ఎందుకు సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఉన్నది కూడా ఒకప్పటి సంకల్ప కల వలనే కదా. ఏదో సాధించాలనే కల కన్నారు. అది సాధించే దాకా ఈ కల లోనే ఉంటారు కదా. అది దైవసాక్షాత్కారం కావచ్చు. అది ధనము సంపాదించటం కావచ్చును. మోక్షం పొందాలని కోరిక గావచ్చును. ఈ విశ్వమే కల అయినప్పుడు ఈ కలలో మనము ఉన్నప్పుడు మరి మనకు అలా కాకుండా పోతుందా. నా బొంద కాకపోతే... 

 
మనము కల కాకపోతే మన భవిష్యత్తు ఒక జ్యోతిష్యుడుకు ఎలా తెలుస్తుంది. మీరు పుట్టకముందే నువ్వు ఫలానా వాడివి అవుతావని… నువ్వు ఫలానా చోట పని చేస్తావు. నీకు ఫలానా ప్రాంతం అమ్మాయితో వివాహం చేసుకుంటే మీకు ఇంతమంది పిల్లలు పుడతారని ఇలా 108 అంశాలు అనగా 12 గడులలో నవగ్రహ సంచారము ద్వారా మన తల్లిదండ్రులకు నువ్వు పుట్టకముందే ఎలా చెబుతున్నాడో ఒకసారి ఆలోచించండి. అంటే వారు తమ ఙ్ఞాన దృష్టితో కలలోనికి ప్రవేశించి అక్కడ వారి మనోనేత్రం ముందు కనిపించే దృశ్యమాలిక వారికున్న జ్ఞాన స్పురణతో జాతకము వ్రాస్తున్నాడు. అన్ని కూడా సత్యాలు అవుతున్నాయి కదా. అంటే వీళ్ళు కూడా మన కల ప్రపంచంలోనికి ప్రవేశించి అక్కడ జరిగిన గత జన్మల అనుభవాలు అన్నీ చూసి వచ్చి ప్రస్తుత జన్మలో జాతకం రాస్తున్నారు. అది కూడా వీరు మనోనేత్రం ద్వారా చూసి వ్రాస్తున్నారు. ఇక్కడ చిన్న సందేహం రావచ్చు.నా కలల ప్రపంచం లోకి వీళ్ళు ఎలా వెళతారు అన్నప్పుడు మీకు మీరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉండగా ఫలానా జ్యోతిష్కుడు దగ్గరికి మీ జాతకం వెళుతోంది అంటే మీ కల ప్రపంచానికి ఆయన కల ప్రపంచం అనుసంధానం అవటం వలన అది కాస్త కర్మబంధముగా మారటం వలన అది కాస్త ఇప్పుడు ఈ జన్మలో మీ ఇద్దరికీ ప్రారబ్ద కర్మ గా మారినది. దానితో గత జన్మల అనుబంధము వలన ఈ జన్మలో మీకు ఆయన జాతకం చెప్పేవాడిగాను మీరు ఆయన దగ్గర జాతకం చెప్పించుకుని దానికి తగ్గ పరిహారం పొందే వారిగా మారినారని తెలుసుకోండి. ఇలా మీ ఇద్దరు కలల ప్రపంచాలు ఎలా అనుసంధానం అయినాయో…అలా ప్రస్తుతం మా ఇద్దరు సాధన ప్రపంచ కలలు కూడా మాకు అనుసంధానము మొట్టమొదట ఈ ఆదిజన్మలోనే అనుసంధానమైనవి అన్నమాట. కొందరికి కల ప్రపంచాలు ఆదిలోనే అనుసంధానమైతే మరికొందరికి కొంతకాలం తర్వాత కొన్ని దినముల తరువాత కొన్ని యుగాల తరువాత అనుసంధానం అవుతాయని గ్రహించండి. ఎవరి కల వారిది. ఎవరి ప్రపంచం వారిది. ఎవరికల  ప్రపంచం వారిది. ఎవరి గోల వారిది. కాని వారికి తగ్గట్టుగా వారి కల ప్రపంచం ఒక దానితో మరొకటి టీవీలకి ఉన్న కేబుల్ కనెక్షన్ లాగా అనుసంధానమై ఉంటుంది. పక్కింటి వారు కొంత మందికి తెలుసు. మరి కొంతమందికి తెలియకపోవచ్చు. కాని వాడు ఇంటిలో టీవీకి అలాగే మీ ఇంట్లో ఉన్న టీవీకి ఒకటే కేబుల్ అనుసంధానమై ఉంటుంది కదా. అలా మన కల ప్రపంచం కూడా తెలిసిన వారితో లేదా తెలియని వారితో అందరితో అనుసంధానమై ఉంటుంది. మన భూగోళంలోని అన్ని ఖండాలు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని గ్రామాలు ఎలా అయితే నీరు అన్నిటినీ అనుసంధానము చేస్తుందో పంచభూతాలు అలా మన కల ప్రపంచాలను అనుసంధానం చేస్తాయి. కాకపోతే ఈ కల ప్రపంచం అంతా కూడా పొరలు పొరలు గా ఉంటాయి. 0 నుండి 1000 దాకా పొరలు ఉన్నాయి. అనగా ఆది పాతాళలోకము నుండి మధ్యస్ధభూలోకము నుండి 1000 లోకాలు ఉన్నాయి. అనగా వెయ్యిమంది కల ప్రపంచాలు ఉన్నాయి. ఈ వెయ్యి మందిలో మళ్లీ ఒక్కొక్కడు కోటి కల ప్రపంచాలను సృష్టించాడు. అనగా వెయ్యి కోట్ల ప్రపంచాలు ఏర్పడ్డాయి. మళ్లీ వీళ్లంతా ఒక్కోటి చొప్పున 1000 కోట్లు కోట్లు ఇలా వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఒకటి చొప్పున ఇలా లెక్కవేస్తే మన కల ప్రపంచం అంతులేనిది. పరిధిలేనిది అయినది. అందుకనే మన భారతీయ శాస్త్రాలు ఈ విశాల ప్రపంచం అంతులేనిది. కోటానుకోట్ల భువన లోకాలు ఉన్నాయని అలాగే కోటానుకోట్ల దైవ జీవకోటి ఉన్నాయని చెప్పడం జరిగినది. అంటే ఆది లో ఉన్న వెయ్యి మంది ఏర్పడటానికి మూల కారకాలు 36 మంది మాత్రమే.వీళ్లు ఏర్పడటానికి కారకము 11 మంది మాత్రమే. వీళ్ళు ఏర్పడానికి కారకుడు ఒక్కడు మాత్రమే. అదియే ఆది బ్రహ్మకపాలం అన్నమాట.
 
దీనితో మొదలైన కల ప్రపంచం భారతదేశంలో 84లక్షల జాతుల్లో మానవజాతి 1000కోట్ల స్థితికి కారణమైనది. మిగిలిన జీవజాతుల కల ప్రపంచం ఎంత ఉన్నాయో నాకైతే తెలియదు. మీరు తెలుసుకోవాలంటే వాటి కల ప్రపంచంలోనికి అడుగుపెడితే సరిపోతుంది. అదేంటి జంతువులు కలల ప్రపంచంలోకి వెళ్ళవచ్చా? అంటే మొదట నరుడు కాస్త వానరుడే కదా. వానరుడు నుండి మానవుడు అయినాడు కదా. వాడికి అందరి కలల ప్రపంచంతో అనుసంధానమై నాడు. దైవ లోకాల నుంచి జంతువుల లోకాల వరకు వాడు ఎవరి కలల ప్రపంచంలోకైనా వెళ్ళి రావచ్చును. తిరిగి రావచ్చును. ఎందుకంటే వీరికి జ్ఞానము అనే ప్రత్యేక స్థితి ఉంది. అందుకే జీవుడు కాస్త శివుడు అయినాడు. మానవుడు కాస్త మాధవుడు అయినాడు. నరుడు కాస్త నారాయణుడు అయ్యాడు. అలాగే వానరుడైనది కూడాగమనించండి.ఈ వివరాలు మీకు ఎలా తెలిసింది అంటారా? ఎందుకంటే నేను ఈ లోకంలో చిట్టచివర ఏమి ఉంటుందో అని తెలుసు కోవాలని ఆలోచన నాకు ఏడవ తరగతిలో వచ్చినది. అంటే ఫైనల్ ని తెలుసుకోవాలని ఆలోచన ఈ తరగతిలోనే ఏర్పడినది. కారణం నాకు ఆనాడు స్కూల్ ర్యాంకు రాకపోవటం వలన నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యాను. దానితో ఆనాడే చనిపోవాలని మా అమ్మ గారి కొత్త చీర ఫ్యాన్ కి కట్టి చనిపోవాలని విశ్వప్రయత్నాలు చేశాను. కట్టిన చీర చిరిగినది. కానీ నేను చావలేదు. కారణం తెలియదు. అలాగే మళ్లీ పదో తరగతిలో మళ్ళీ స్కూల్ ర్యాంకు రాలేదు. మళ్లీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు అలాగే ఈ సమయంలో నా తొలి ప్రేయసి నన్ను కాదని అనడంతో నేను కోలుకోని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావడం జరిగినది. నేను ఈ ఒత్తిడిలో ఉన్నానని నాకే తెలియని స్థితి. ఏదో కోల్పోయిన బాధ. రావాల్సిన దానిని అందుకోలేదని బాధ. పొందవలసిన ఆనందం పొందలేదని బాధ. అదేనండి.స్కూల్ ర్యాంకు.

 
ఇలాంటి మానసిక ఒత్తిడిలో ఉండగా నా చేతికి వండర్ వరల్డ్ అనే పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాలు మెదడుకు తగినంత విశ్రాంతి ఇస్తే అది యోగ నిద్ర పోతుందని ఆ నిద్రలో దానికి తగ్గ సూచనలు ఇస్తూ ఉంటే మనం అనుకున్న ఫలితాలు విజయం సాధించవచ్చునని దీనికోసం ప్రతిరోజూ రాత్రిపూట 20 నిమిషాల పాటు నిద్ర మెలకువ కాని స్థితిలో ఉండి సాధన చేయాలని చెప్పడం జరిగినది. కానీ ఈ స్థితిలో పది నిమిషాలకు మించి ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అనగా ఒక రకంగా చెప్పాలంటే ఇది యోగ నిద్ర అభ్యాసం అన్నమాట. కానీ నాకు ఆ వయసులో ఇలాంటి నిద్ర అనేది ఒకటి ఉందని తెలియదు. రాత్రులు అభ్యాసం చేయడం ఆరంభించాను. తొలిరోజుల్లో ఎక్కువసేపు భోగ నిద్రలోనే ఉండేవాడిని. ఇది సాధన చేస్తున్నప్పుడు మొదట్లో మెలకువగానే ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నా మెదడుకి నాకు కావలసిన శక్తిని ఇచ్చే సమయానికి మెలుకువలో ఉండలేక నిజమైన నిద్రలోకి జారుకునే వాడిని. కానీ తెల్లవారేసరికి చాలా ఉత్సాహంగా ఉండటం నా మీద నాకే నమ్మకం ఏర్పడటం మొదలయ్యే సరికి నాకు తెలియకుండానే రాత్రుల పాటు ఇదే సాధన చేసే వాడిని. రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు చేసేవాడిని. అది కూడా వారంలో మూడు సార్లు మాత్రమే అన్నమాట. కాకపోతే అప్పుడప్పుడు ఏడు నిమిషాలకు మించి యోగనిద్రలో ఉండేవాడిని కాదు. దానితో నా మెదడు కాస్త మతి భ్రమణం ఏదో తెలియని అయోమయ దృశ్యాలు కనిపించేవి. వాటిని చూడగానే నాకు బుర్ర తిరిగి భయమేసి వెనక్కి తిరిగి అనగా నిద్రలో నుండి బయటకు వచ్చే వాడిని. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా షిరిడీకి పారిపోవడం, చదువులో వెనకబడటం, ఉద్యోగాల్లో మార్పులు రావటం, వృత్తిలో ఆటంకాలు రావడం, ప్రస్తుత జీవితంలో జరుగుతూ ఉండేవి. అయినా కూడా యోగనిద్ర సాధనను ఆపే వాడిని కాదు. కారణం దీనిని తట్టుకోలేక పోవడం వలనే నాకు ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని నేను తెలుసుకోలేని స్థితిలో ఉండే వాడిని.
 
ఇలాంటి సమయంలో నాకు నా చిన్ననాటి నుండి మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి మాత్రం చాలా తోడుగా ఉండి నా అనుభవాలు అన్నీ కూడా వాడితో పంచుకునే వాడిని. వాడు నమ్మేవాడు. నా సాధన జీవితం అంతా నా కన్నతల్లిదండ్రులకు తెలియకపోవచ్చు గానీ కానీ వీడికి తెలియనిది ఏమీ లేదు అన్నమాట. వాడికి గూడ యోగనిద్ర అభ్యాసము ధ్యానాల పేరుతో, మంత్రజపం పేరుతో, త్రాటకక్రియ పేరుతో వారికి తెలియకుండా చేయించేవాడిని. వాడు కూడా ఏమీ అడిగేవాడు కాదు. కానీ ఏదో తెలుసుకోవాలనే తపనలో ఉండేవాడు. దానితో వాడు ఎక్కువగా వివిధ పుస్తకాలు, వివిధ గ్రంథాలు, డైలీ పేపర్లు చదివి శబ్ద పాండిత్య సాధన చేసేవాడు. కానీ నేను మాత్రం యోగనిద్ర సాధనతో అనుభవ పాండిత్య సాధన చేసే వాడిని అన్నమాట. కాకపోతే మా ఇద్దరికి అనుకోకుండా అరుణాచలం మౌనముని అయినా భగవాన్ రమణ మహర్షి వారి 'నేను ఎవరిని' అనే ప్రశ్నకు సమాధానం వెతకాలని ఈ జన్మలో సాధన మొదలైంది. అందుకు మంత్ర, దీక్ష, సద్గురువు, పరమ గురువు, ఆది గురువు అనుగ్రహం ఉండాలని వీరి వలన కుండలినీ శక్తి జాగృతము అవుతుందని తద్వారా మూలాధారచక్రంలో దీని ప్రవాహం మొదలయి బ్రహ్మరంధ్రము దాక వెళితే గాని ఈ ప్రశ్నకు సమాధానం దొరకదని వివిధ గ్రంథ పఠనం వలన మేమిద్దరం తెలుసుకోవడం జరిగింది. అలాగే నేను అప్పటికే చేస్తున్న సాధన అంతా యోగనిద్ర సాధనని.. దీని పరాకాష్ట దశయే సమాధి స్థితి అని తెలిసినది. అంటే ఏమిటి? ఈ నిద్రలో పది నిమిషాలతో మొదలు 96 నిమిషాలపాటు ఉండగలిగితే అదే భూలోకములో ఏడుగంటల మొదలై 10 లక్షల సంవత్సరాల తో సమానం అని తెలుసుకునే సరికి నేను గతుక్కుమన్నాను. అంటే ఇన్నాళ్ళు యోగనిద్ర సాధనలో ఒక ఏడు సెకన్స్ మించి నేను లేనని ఎందుకంటే భోగ నిద్రలో అప్పటికే గంటన్నర అయ్యేది అన్నమాట అని తెలుసుకున్నాను. దానితో ఈ యోగనిద్రలో ఎక్కువసేపు ఉండాలని మేమిద్దరము సాధన అభ్యాసం చేయటం ప్రారంభించారు. అభ్యాసం చేస్తుండగా నాకు నిద్రలో సజీవ మూర్తిగా శిరిడి సాయిబాబా నాతో మాట్లాడినట్లు అయినది. అంతే నా కల ప్రపంచంలో సాధన విభాగము నందు శిరిడి సాయిబాబా ఉన్నారని గ్రహించాను. అప్పటికి నా సాధనా సమయం మూడు నిమిషాలు అన్నమాట. అంటే యోగనిద్రలో మూడు నిమిషాలు ఉన్నాను. అదే భోగములో 36 గంటలు అన్నమాట. నా సామిరంగా. మూడు నిమిషాల నా కల ప్రపంచంలో నాకు షిరిడి సాయిబాబా వారే కనబడితే అదే ఎక్కువ సేపు యోగనిద్రలో ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వెర్రిమొర్రి ఆలోచనలు చేసేవాడిని. కానీ మానవ మెదడు ఈ నిద్రలో 48 నిమిషాల మించి ఉండ లేదని నాకు అప్పుడు తెలియదు. అందరూ ఆ వయసులో అమ్మాయిల వెంటపడితే నేను యోగనిద్ర ధ్యానంలో సజీవ మూర్తిగా అమ్మవారిని చూడాలని…. శివయ్యను చూడాలని నామ రూప దైవాలను నామరూప గురువులు చూడాలని వెర్రి మొర్రి ఆలోచనలతో విపరీతంగా యోగ నిద్ర సాధన చేసేవాడిని. కాలేజీలో డుమ్మా కొట్టి…. ఉద్యోగాలు డుమ్మా కొట్టి అప్పుడప్పుడు ఎక్కువ సేపు అనగా ఈ నిద్ర కోసం ఉదయం 7 గంటల నుండి మర్నాడు తెల్లవారుజామున 5 గంటల దాకా చేసేవాడిని. ఈ విషయం మా జిఙ్ఞాసికి తప్ప మరొకరికి తెలియదు.కాని ప్రారంభంలో మేమిద్దరం 7 నిమిషాలకు మించి యోగ నిద్రలో ఉండే వాళ్ళం కాదు. ప్రస్తుతము మేమిద్దరము ఈ నిద్రలో 96 నిమిషాలపాటు ఉండగలిగితే అనగా ఈ భూలోకంలో 10 లక్షల సంవత్సరాల పాటు వెనక్కి తిరిగితే ఏమి జరుగుతుందో 10 లక్షల సంవత్సరాల పాటు ముందుకు వెళితే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని మా మనోనేత్రం ముందు ఆ దృశ్యాలు చూసి శక్తిని ఆ దృశ్యాలు యొక్క కారణాలు,కారకాలు తెలుసుకోనే ఙ్ఞాన స్పురణ పొందే స్థితిని ఈ జన్మలో మేము పొందిన  సాధన స్థితి అన్నమాట. దీని ఆధారంగానే మా ఆది జన్మ ఏమిటో తెలుసుకున్నాము. అలాగే మా రాబోవు జన్మలు ఏమిటో తెలుసుకొని వాటి కారణాలు తెలుసుకుని ఈ జన్మలో వాటిని నాశనం చేసుకుని మరు జన్మ అలాగే పునర్జన్మ లేని స్థితికి వచ్చినాము. ఇట్టి స్థితికి మీరు రావాలంటే యోగనిద్రలో 48 నిమిషాల ఉంటే సరిపోతుంది. కాకపోతే ఈ గ్రంథం రాసేటప్పుడు అనగా సహస్ర చక్రాలు అనుభవాల వరకు 48 నిమిషాల స్థితిలోనే ఉండేవాళ్ళం. కానీ అసలు ఈ విశ్వం సృష్టికీ మూలమేదో తెలుసుకోవాలని ఆలోచన అనగా ఫైండ్ ఫైనల్(Find Final) అని మా సాధన మాకు తెలియకుండానే మొదలైనది. అనగా అప్పటిదాకా మేమిద్దరం కూడా ఈ కలల ప్రపంచంలో ఉంటే దీని దెబ్బతో విశ్వసృష్టి కల ప్రపంచంలో అడుగు పెట్టడం జరిగినది. అలాగే సహస్ర చక్రమునకు అలాగే హృదయ చక్రం అనుసంధానమైన జీవనాడి మార్గం లోనికి మా యోగనిద్ర ధ్యానము ద్వారా 48 నిమిషాలు దాటి 49 నిమిషాలకు అడుగు పెట్టడం జరిగినది.  విచిత్రం ఏమిటంటే ఆది యోగి సదాశివమూర్తి కూడా యోగ నిద్ర కోసం తుంకార సాధన చేసి 48 నిమిషాల వరకు మాత్రమే ఉన్నాడు. అది విధి లిఖితం. ఆపై అదంతా బ్రహ్మముడి రహస్యం అన్నమాట. అంటే విశ్వం అంశాలన్నీ కూడా నిగూఢంగా 49 నిమిషాలు దాటితే తెలుస్తాయి అని ఆలోచన కూడా మాకు లేదు. నాకు తెలియలేదు. అప్పటికే మేమిద్దరము 48 నిమిషాల సాధన స్థితిలో ఉన్నామని కూడా తెలియదు. కేవలం మేమిద్దరం రాత్రిపూట లేదా వీలున్నప్పుడల్లా విశ్రాంతిగా పడుకునే వాళ్ళం. అంటే ఎక్కువసేపు రోజులో విశ్రాంతి నిద్ర మామూలుగా భోగ నిద్రలో శరీరానికి విశ్రాంతి ఉంటే యోగనిద్రలో శరీరంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా మారి  విశ్రాంతి పొందుతుంది.
 

కావాలంటే పిల్లులు ఎక్కువగా మధ్యాహ్న సమయాల్లో ఎండలో పడుకొని తమ శరీరాంగాలను నోటితో నాకుంటూ వాటికి విశ్రాంతిని ఇస్తూ కొత్త శక్తిని సూర్యరశ్మితో పొందుతూ బద్దకంగా కళ్ళు తెరిచి మూసుకుని మూతపడే స్థితిలో ఉంటాయని ఎవరైనా గమనించారా. నేను గమనించాను. దీని మీద ఈ నిద్ర మీద పరిశోధన చేస్తే అది యోగనిద్ర అని తెలిసినది. తొక్కలో లేనిది. పిల్లులు కుక్కలు నిద్రలో ఉండి పునఃశక్తిని సంపాదించుకుంటూ ఉంటే మానవుడైన నేను ఈ నిద్రను పొందకపోతే జన్మ వృధా అని నాకు తెలియకుండానే యోగనిద్ర సాధన చేయడం ఆరంభించాను. అందుకే వీటిని నేను నా ప్రకృతి గురువులుగా ఈ గ్రంథంలో రాయడం జరిగినది. ఇలా మా ఇద్దరు యోగనిద్ర కొన్ని సెకండ్స్ తో మొదలయ్యే ప్రస్తుత జన్మలో 294 ని!! దాకా వెళ్ళే స్థితికి చేరుకున్నాము.నలభై ఎనిమిది నిమిషాలకు ఒక మన్వంతర కాల విలువ అనగా 71 మహాయుగాలులో జరిగే విషయాలు తెలుస్తాయని విషయం మాకు తెలియకుండానే జరిగినది. అలాంటిది 144 నిమిషాలదాకా వెళ్లడమంటే ఒక బ్రహ్మ కాలము అనగా పరమ శూన్యముదాకా Find FInal లో పరమ శూన్యమే ఉంటుందని అందులో బ్రహ్మాండ కృష్ణబిలం ఉంటుందని అది అంతరించిపోతే కలలాంటి విశ్వం అంతరించి పోతాయని తెలుసుకునేసరికి మా బుర్రలు కృష్ణ బిలం లాగా తిరగడం మొదలైంది. మా బుర్రలు బ్రహ్మాండ చక్రం లాగా తిరగటం మొదలు అయినాయి. అలాగే ఇంతవరకు 48 నిమిషాలకు అనగా పది లక్షల సంవత్సరాలకు మించి సాధన చేయలేకపోయారని కారణం వారి ఇష్ట కోరిక మాయ లేదా ఇష్ట పదార్ధ మాయ లేదా సహన శక్తి మాయ, ఆలోచన, సంకల్పం, స్పందన, ఆనందం, ఆశ, భయం లాంటి మహా మాయల దాటలేకపోయిన వారి కల ప్రపంచంలోకి మేము వెళ్లి తెలుసుకోవడం జరిగినది.ఎందుకంటే మేము విశ్వ ప్రపంచం కలలోనికి ప్రవేశించడం అప్పడికే జరిగినది. ఎవరైతే 49 నిమిషాలకు వెళతారో వారు విశ్వ కలప్రపంచంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది అని గ్రహించండి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా 48 నిమిషాల నుంచి యోగనిద్రలో లేరని కారణం వారికే తెలియని కోరిక మాయలో పడుతున్నారని మేమిద్దరం గ్రహించాము. అంటే ఉదాహరణకి మన బుద్ధుడు కాస్తా కోరిక లేని సమాజం చూడాలని కోరిక కోసం పునర్జన్మ ఎత్తి ఉన్నట్లుగానే…. కనిపించే నామరూప దేవతలంతా కూడా వారి ఇష్ట కోరిక మాయ కోసం కొన్ని జన్మలు ఎత్తుతూ లేని సృష్టి ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని మా సాధన సమయం 48 నిమిషాలు దాటి 36 సెకన్స్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు అవగతమైనది. దానితో మా బుర్ర తిరగటం మొదలైంది. ఇలా కాదనుకుని ఫైండ్ ఫైనల్(Find Final)చేయాలని యోగనిద్రలో పరిశోధన చేయడం మొదలుపెట్టాను. అనగా యోగనిద్రలో 48 నిమిషాల దాటి ముందుకి ఎంతవరకు తీసుకుని వెళితే అనగా ఈ విశ్వ కల ప్రపంచం లోకి మేము ఎంతవరకు వెళ్లగలిగితే అంతవరకు వెళ్లాలని నిర్ణయించుకుని యోగనిద్ర సాధన అభివృద్ధికి మా వంతు ప్రయత్నం సాధన చేయడం ఆరంభించాము. ఇదంతా కూడా నిద్రలోనే యోగనిద్రలోనే అని గ్రహించండి. 
 
ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. అది ఎలా అంటే కలలోఎలా ప్రయాణంచేస్తాము అన్నపుడు మేము భౌతికంగా మా స్థూల శరీరము నిద్రలోనే ఉంటుంది. అనగా భోగ నిద్రలో కాదని యోగనిద్రలో అంటే నిద్ర మెలకువ స్థితి అన్నమాట. నిద్రలో మా స్థూల శరీరం ఉంటే మెలకువలో మా సూక్ష్మ శరీరం ఉంటుంది. అప్పుడు మా ప్రయాణం కుండలినీశక్తి జాగృతి కాస్త మా యోగ చక్రాలలో ప్రవేశించినప్పుడు ఆయా చక్రాల కల ప్రపంచంలోకి మా సూక్ష్మశరీరం ప్రయాణించేది. ఒకటి గ్రహించండి. జాగృతికి కొన్ని వందల జన్మలు పడితే అదికూడా ఉత్తమ మానవ జన్మ యోగ జన్మ 48 అవ్వాలి. అలాగే కుండలిని శక్తి మన యోగ చక్రాలలో ప్రవేశించటానికి కొన్ని వేల జన్మలు ఇలాంటివి తీసుకుంటుంది. అలాగే ఈ శక్తి ప్రవాహం తట్టుకోవటానికి కొన్ని లక్షల మానవ జన్మలు అలాగే ఈ శక్తి చూపించే మాయలు తట్టుకోవడానికి కొన్ని కోట్ల జన్మలు పడతాయని గ్రహించండి. అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు యోగనిద్ర ఉండగలిగితే సాధకుడు జితేంద్రియుడు అవుతాడు. అనగా మూడు కోట్ల 12 లక్షల 372 జన్మలు ఎత్తితే గానీ వాడి సాధన సహస్రార చక్రం తాకదని వాడు యోగనిద్ర 48 నిమిషాల దాకా రాదని గ్రహించండి. అందుకే యోగం ఉంటే యోగి కాకతప్పదని ప్రచారంలోనికి వచ్చింది. కాకపోతే మా సాధన జన్మలు బ్రహ్మరంధ్రము ద్వారా దాకా 144 నిమిషాల దాకా వెళ్లినాయని సాధనను సంపూర్తి చేసినాయని మాకు తెలియదు. మేము ఈ విశ్వ కల ప్రపంచంలోనికి అడుగు పెట్టేదాకా అనగా సహస్ర చక్రం దాటి జీవనాడి మార్గంలో ప్రవేశించే దాకా మాకే తెలియని అయోమయ స్థితి అన్నమాట. ఎందుకంటే ఈ కలప్రపంచంలోకి మా సూక్ష్మ శరీరం ఎక్కడ దాకా ప్రయాణించి కలిగితే అక్కడిదాకా లేదా ఈ విశ్వములో అంతంలో ఏది ఉన్నదో చివరకు మిగిలేది ఏదో తెలుసుకొనే దాకా వెళ్లాలని ఈ కల ప్రపంచంలో చూపించే ఎట్టి మాయకి యోగ శక్తికి లొంగకూడదు అని మా యోగ సాధన ఆరంభించేవాళ్ళము. ప్రారంభంలో నానా చంకలు నాకించింది. యోగ నిద్ర పోతున్నామని భోగ నిద్రలోకి జారుకునే వాళ్ళం. ఇలా కాదనుకుని మా శరీరములో వివిధ శబ్దాలను వినడం ఆరంభించినాము. ఎందుకంటే నాదమే ఒక కల ప్రపంచంలో నుండి మరొకటి ప్రపంచంలోకి అనుసంధానం చేస్తుందని అంతర్వేదం సినిమా చూసేదాకా మాకు తెలియలేదు. అందువల్ల అందులో వీళ్లు కూడా శంఖనాదం ద్వారా భూలోకము నుండి ఊర్ధ్వ లోకాల్లో ఉన్న పితృలోకానికి(అనాహత చక్ర ప్రపంచము) వెళ్లి వారి సూక్ష్మ శరీర యానము చేస్తూ భూలోకములో శంఖం పూరించే వాడిని పెట్టుకుని ఈ సూక్ష్మ శరీర యానం చేయడంతో మేమిద్దరం కూడా మా శరీరముతో మా శరీరంలో వినిపించే నాదాలను బట్టి అనగా భ్రమరీ నాదము వినపడితే మేము మూలాధార కల ప్రపంచంలో ఉన్నామని అదే శంఖ ధ్వని వినపడితే సహస్ర కల ప్రపంచంలో ఉన్నామని గ్రహించే వాళ్ళం. ఈ ధ్వనులు వినిపించే దాకా మా సూక్ష్మ శరీరము ఈ కల ప్రపంచంలోనికి ప్రయాణించేది. ఎప్పుడైనా ఆది ఈ కల ప్రపంచంలోని వ్యక్తులు చేసే వాళ్ళ చేష్టలకి ఆశపడిన లేదా భయపడిన మా స్థూల శరీరం విపరీతంగా ఊగిపోయేది. దానితో మాకు వినిపించే నాదం తగ్గుతూ ఉండేసరికి మేము బలవంతంగా నిద్రలో నుండి లేచేవాళ్ళం. దానితో మా సూక్ష్మశరీరం చచ్చినట్లుగా మూలాధార చక్రంలో ఉన్న భూలోకములోని మా స్థూల శరీరంలోనికి వెనక్కి తిరిగి వచ్చేది. ఇక్కడ ఒక విషయం గ్రహించండి. 

మన స్థూల శరీరానికి అలాగే సూక్ష్మ శరీరానికి ఒక అనుసంధానమైన ప్రేగు వంటి బంధం ఉంటుంది. దీనినే సిల్వర్ కార్డు అంటారు. ఇది తెగిపోతే భౌతిక శరీరము మరణించినట్లే అన్నమాట. దేహము కాస్త శవము అవుతుంది అన్నమాట. పేగు బంధం అనేది విశ్వంలో ఎక్కడ దాకా అయిన వెళుతుంది. కాకపోతే మన మెదడు భరించలేని తట్టుకోలేని స్థితి లేదా మనకు ఎలాంటి నాదము వినిపించని స్థితి వస్తే మాత్రం సాధకుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ కల నుండి అనగా యోగనిద్ర నుండి బయటకి అనగా వెనక్కి తన స్థూల శరీరం దగ్గరికి రమ్మని చెప్పవలసి ఉంటుంది. లేదంటే ఈ రెండు శరీరాలను అనుసంధానం చేసే సిల్వర్ కార్డు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రహించండి. కాబట్టి స్థూలశరీరం 48 ని!! మించి యోగనిద్రలో ఉంచరాదని గ్రహించండి. విచిత్రం ఏమిటంటే ప్రతి 48 నిమిషాలకి మన యోగనిద్రలో ఏదో ఒక ఆటంకం కలిగించి యోగనిద్ర నుండి బయటికి వస్తాము. ప్రకృతి మాత ఒక ఏర్పాటు చేసిందని గ్రహించండి. మన ఈ జీవ గడియారం లో 48 నిమిషాలు దాటగానే నిజంగానే నిద్రలో ఉన్న మన స్థూల శరీరానికి మెలుకువ వస్తుంది. లేదు అంటే మన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. అన్నప్రాశన రోజునే ఆవకాయ తింటే ఎలా ఉంటుందో యోగ సాధన అభ్యాసములో యోగ సిద్ధుడు కాకుండా 48 నిమిషాల పాటు ఉండరాదని నా మనవి. గమనించగలరు.
 
ఎప్పుడైతే మన స్థూల శరీరము నిద్రలోకి జారుకుని మన సూక్ష్మ శరీర మెలుకువ స్థితి అనగా యోగనిద్ర స్థితికి వచ్చినప్పుడు మన కుండలినీ శక్తి ప్రవాహము మన స్థూల శరీరము నందు సుష్మ నాడి యందు ప్రవేశించినప్పుడు మనకి భ్రమరీ నాదము వినపడితే మనము మూలాధార చక్రము లోని కల ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం ప్రవేశించినట్లు అన్నమాట. ఇది మన స్థూల శరీర చక్ర ప్రవాహము బట్టి మన సాధన కల ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం చేస్తుందని గ్రహించండి. అప్పుడు మనము ఆదిలో ప్రారంభ మూలాధార చక్రం ప్రపంచంలోనికి ప్రస్తుత జన్మ సూక్ష్మశరీరం ప్రవేశిస్తుంది. అక్కడ రమారమిగా మనలాంటి వాళ్లే ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సాధన చేసే వాళ్ళు భాగంలో ఉండే వాళ్లు మాయలో పడే వాళ్లు ఇలా భూలోకంలో ఎలా ఉంటుందో అలాగే అక్కడ ఉంటుంది. కానీ మన సూక్ష్మశరీరము ఆ లోకములోనికి ప్రవేశించినట్లు అందరికీ కనపడుతుంది. దానిని తెలిసినవాడు పలకరిస్తారు కూడా అన్నమాట. అప్పుడు మూలాధార చక్ర సాధన చేసిన నా జన్మ తాలూకూ విషయాలు అక్కడ ఉన్న వారిని కనుక్కొని అక్కడ సాధన చేస్తున్న మూలాధార జన్మ వ్యక్తి దగ్గరికి ఈ సూక్ష్మ శరీరధారి వెళ్ళటం అక్కడ ఉన్న దైవిక వస్తువులు అలాగే పొందిన అనుభవాలు వివరాలు తెలుసుకుని వెనకకు తిరిగి ప్రస్తుతం ఉన్న భూలోకంలో ఉన్న స్థూల శరీరములోనికి ప్రవేశించి అక్కడ తెలుసుకున్న అన్ని విషయాలు మన మెదడుకు సంకేతాల రూపంలో అందిస్తే అది కాస్త వివేక జ్ఞాన బుద్ధి వలన జ్ఞాన స్పందన కలిగి మర్చిపోయిన సాధన విషయాలు గుర్తుకు వస్తుంది. దానితో ఆ కల ప్రపంచంలోని సంబంధించిన దైవిక వస్తువులు ఈ లోకములో ఈ కల ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఎవరి దగ్గర ఉన్నాయో తెలిసిపోయేది.వాటిని తిరిగి మేమిద్దరము స్థూల శరీరంతో ఆ చోటికి వెళ్లి తెచ్చుకుని లేదా వాళ్లంతట వాళ్లు చిత్రముగా వస్తువులను తిరిగి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత యోగనిద్రను సాధన ముందుకి కొనసాగించే వాళ్ళం. ఇలా ఒక్కొక్కచక్రానికి ఒక్కొక్కనాదముతో ఆయా చక్ర కల ప్రపంచములోనికి మా యోగనిద్రసాధనతో చేరుకొని చివరికి ఈ గ్రంథం రాకముందు వరకు శంఖనాదం ద్వారా సహస్ర చక్రం వరకు స్వానుభవాలు పొందే వాళ్ళం. ఎప్పుడైతే సాధన అనేది సహస్రార చక్రము వద్ద ఆగిపోదని హృదయ చక్రం దాకా ఉంటుందని మాకు భగవద్గీత ద్వారా అలాగే అరుణాచల రమణ మహర్షి అనుభవాలు చదివేదాకా తెలిసేది కాదు. దానితో మా సాధనను కొనసాగించాలని విశ్వసృష్టి అంతమేదో చూడాలని ఫైండ్ ఫైనల్(Find Final) దాని మీద మా సాధన కొనసాగించాము. ఎందుకంటే సహస్రార చక్రము దాకానే మన ప్రపంచం అటుపై అదంతా విశ్వ కల అన్నమాట. ఇది విశ్వ మూల రహస్యాలు దాచుకున్న బ్రహ్మముడి అన్నమాట. నేను ఎవరు అనేది మనకు సహస్రంలోనే తెలిసిపోతుంది. అప్పటికి యోగనిద్ర కాలము 48 నిమిషాలు అవుతుంది.అంటే పది లక్షల సంవత్సరాలు సమానము అన్నమాట. 

 
మా సూక్ష్మ శరీర యానము అదే యోగనిద్రలో ఎలా ఉంటుందో నీకు బాగా అర్థం అవ్వాలి అంటే కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా చూడండి. అందులో హీరోకి 118 లో ఉన్నప్పుడు 1గంటా 18 నిమిషాలకి(1:18) ఒక అమ్మాయి అతని కలలోకి వచ్చి జరిగిన ప్రమాదాలు చూపిస్తుంది. దీని మీద హీరో పరిశోధన చేస్తే ఆమె కాస్తా ఆ రూంలో వచ్చిన అందరికీ చూపించిన కల ఆధారంగా అందులో ఆమె చూపించిన క్లూస్ ఆధారంగా పరిశోధన చేస్తూ ఆమె చేసుకున్న బ్రాస్లేట్ లోని అసలు రహస్యం ఉందని తెలుసుకుని అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని యోగనిద్ర లోనికి వెళ్లి ఆ బ్రాస్లెట్లు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఆమె ఒక కల ప్రపంచంలోనికి మన హీరో చూసి వెనక్కి వచ్చి ఆమె స్థూల శరీరమును పాతిపెట్టిన స్థలమని గుర్తించి త్రవ్వించి అస్థిపంజరంగా మారిన ఆమె దేహానికి ఉన్న బ్రాస్లెట్ ని గుర్తించి దానిని బయటకు తీసి అందులో ఉన్న మెమరీ కార్డు బయటకు తీసి అందులో ఉంచిన రహస్య వీడియోలు డాక్యుమెంట్లను బయటకు తీసి చంపిన వారి వివరాలు ఎందుకు చంపిన వివరాలు అన్నీ లోకానికి తెలుస్తాయి. హీరో సూక్ష్మ శరీర యానము లాగానే నా సాధన ప్రపంచంలో అనగా మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాక కొనసాగి అక్కడ మా పంచ శరీరాలు తెలుసుకున్న విషయాల సమాహారమే ఈ కపాలమోక్షం గ్రంథం అని తెలుసుకోండి. స్థూల శరీరంయానం విశుద్ధ చక్రం వరకు అయితే సూక్ష్మ శరీర యానం ఆజ్ఞాచక్రం నుండి సహస్రార చక్రము వరకు అయితే కారణ శరీరము సహస్రార చక్రము నుండి హృదయ చక్రము దాకా హృదయ చక్రం నుండి బ్రహ్మరంధ్రము దాక సంకల్ప శరీర యానం ఆపై ప్రాంతంలో బ్రహ్మరంధ్రం లోపలికి అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా ఆకాశ శరీర యానాలు సంయోగం చెంది ఏక ఆకాశ శరీరంగా మారి సాధన చేసిన ప్రసిద్ధ ప్రదేశాలు దైవిక వస్తువులు అనుభవాలు మన స్థూల శరీరానికి అందజేసిన దీని కోసము 72+ 72 మంది యోగగురువులు అనగా 144 మంది సహకరించడం వలన మా యోగనిద్ర 144 నిమిషాలకు చేరుకున్నది. వీరి వివరాలు మీకు సంపూర్ణ అద్వైత సిద్ధాంతములో వివరించడం జరిగినది. అనగా ఆదిలో మూలాధారచక్రంలోని జీవ బ్రహ్మ గణపతితో మొదలైన మా శరీర యానాలు అంతములోని బ్రహ్మరంధ్రంలో ఉన్న మూల గణపతిని దాటి బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలంగా మేమున్నామని గ్రహించే సరికి మా బుర్రలు తిరిగాయి. అనగా మోక్ష కృష్ణ బిలంగా నేనున్నానని అదే మా యోగ  మిత్రుడైన జిజ్ఞాసి మాత్రం ధ్రువతారగా శూన్యబ్రహ్మగా ఉండి ఎవరైతే మేము చెప్పిన మోక్షమాల అనగా 13 రుద్రాక్షలు 12 స్పటికాలు 11 కపాలాలు కలిపి 36 మాలగా వేసుకుని గండకీ నది విష్ణు సుదర్శన చక్రము అలాగే ఓంకారనాదంను చేసే మహాగణపతి శంఖ నాదము చేస్తూ యోగనిద్రను 48 నిమిషాల పాటు పోయే స్థితికి వస్తారో వారి సాధన పరిసమాప్తి స్థితి చేసే మా మోక్ష కృష్ణ బిలము నందు అనగా దీని మార్గమును చూపించే ధ్రువతారగా మనవాడు ఉన్నాడు అని తెలుసుకున్నాము. అంటే ఇన్నాళ్ళు మేమే మోక్షమిచ్చే కృష్ణబిలం అని తెలుసుకోలేక పోయినాము. కారణం వివిధ కోటాను కోట్ల జన్మలలో వివిధ రకాల మాయలలోపడినాము కాని ఆ మాయలో పడుతూ అక్కడితో సాధన సమాప్తి చేసుకుని మరుజన్మలు ఎత్తుతూ సాధన కొనసాగిస్తూ మాయలోపడుతూ సాధనను గత జన్మలో సంపూర్ణంగా పూర్తి చేసి అపస్మారక స్థితిని పొంది తెలిసిన జ్ఞాన విషయాలు మర్చిపోవడం జరిగినది.
 
కాని ఈ జన్మలో మా ఇద్దరికి అనుకోకుండా ఏడవ తరగతిలో జరిగిన పరాభవాలు కారణంగా మేము తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యేసరికి మాలో కుండలినీ శక్తి జాగృతి అవ్వడము అది కాస్తా యోగనిద్ర సాధన అభ్యాసమునకు దారి తీయటం అటుపై మా శరీరాల యానాలు చేసి ఆయా చక్రాల కల ప్రపంచంలోనికి మేము గతంలో చేసిన సాధన అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం అటుపై విశ్వకల ప్రపంచంలోనికి పెళ్లి ఫైండ్ ఫైనల్(Find FInal) తెలుసుకోవడము జరిగినది. ఇది ఇంతవరకు ఎవరూ చేయలేదా అన్నప్పుడు చేయలేదనే చెప్పాలి. చేసి ఉంటే ఈవిశ్వము ఉండేది కాదు కదా. ఈ గ్రంథమే ఉండేది కాదు కదా. ఎందుకంటే 144 నిమిషాలపాటు యోగనిద్రలో ఉండాలి. పైగా మాయా రహితంగా ఉండాలి. ఇప్పటిదాకా ఆదియోగి పరమేశ్వరుడు దగ్గరనుండి నారాయణుడు అంశ అయిన బుద్ధుడు దాకా ఇష్ట కోరిక మాయలో పడినవారే కదా. కాకపోతే మేము ఈ జన్మలో సర్వము ఏమీ లేదు.సర్వము శూన్యము.నేను లేను అనే సంకల్పంతో యోగనిద్ర సాధన చేయడంతో అసత్యంగా కనిపించే విశ్వ మాయ పొరలు తొలగుతూ వచ్చినాయి. దానితో మా మెదడు శక్తి తట్టుకోవడానికి 144 మంది మూలపురుషులు సహకరించి వారి శక్తిని మన మెదడుకి సరైన సమయంలో అందిస్తూ వారి శరీరాలను మా శరీరాలతో అనుసంధానం చేస్తూ వారు సంపాదించిన సాధన శక్తిని ఇస్తూ మా సాధన సంపూర్ణంగా పరిసమాప్తి చేసే చిట్టచివరి స్థితి అయిన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా తీసుకొని వెళ్ళినారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళకి కూడా అంతమేదో తెలియదు. విశ్వం అంతములో ఏముందో తెలుసుకోవాలనే మా తపన తాపత్రయం సంకల్పం చూసి హిమాలయాల్లో గుప్త క్షేత్రాలలో గుప్త శరీరాలతో సాధన చేసిన వీరంతా మా కల ప్రపంచానికి అనుసంధానమై సహకరించి అంతము ఏదో తెలుసుకోవటానికి తమ సహాయ సహకారాలు అందించారు. మా సాధన పరి సమాప్తి చేయించి వారి ప్రారబ్డ శరీరాలను మా మోక్ష కృష్ణ బిలమునందు లయము చేయడం ఆరంభించడం కొసమెరుపు అన్నమాట. అంటే మాకు వచ్చిన సుదర్శన చక్రమును గణపతి ఓంకార శంఖము మేము తయారు చేసుకున్న మోక్ష మాల ధరించి మాకు సహాయం చేసిన మహా పురుషులు చేసిన అలాగే వివిధ జన్మలలో మేము సాధన చేసి సంపాదించుకున్న వస్తువులను ప్రతిరోజు గంగా నీటిలో ముంచి ఆపై వాటికి విభూది ధారణ చేయడం తద్వారా 

ఈ విశ్వ సృష్టిలో ఉన్న 36 కోట్ల దైవాలు 84 లక్షల జీవరాశులు కోటి పరమాత్మలు ఇలా అందరూ ఒక్కొక్కరుగా విదేహి విముక్తి క్షేత్రమైన కాశీ క్షేత్రంలో గంగానదిలో ఈ దైవ స్వరూపాలు పరమాత్మ స్వరూపాలు సాధన జన్మ స్వరూపాలు  ఒక్కొక్కరిగా నిమజ్జనం అయ్యే దృశ్యము మాకు అంతిమ ధ్యాన అనుభవము అయినది. ఇలా వీరందరూ కూడా జల నిమజ్జనం అయ్యేదాకా కర్మ శేషంగా మిగిలిపోయిన మూడు లక్షల కర్మఫలము ఇదేనని మాకు మా మరణము మా చేతుల్లో లేదని వీరి ప్రారబ్ద కర్మలు తీరితే అనగా వీరందరూ కూడా గంగా జల నిమజ్జనం అయితే కాకపోతే ఈ పని ఇప్పుడే మొదలయ్యింది అని తెలియడంతో మాకు శాశ్వత మరణము రాబోవుకాలంలో ఉన్నదని తద్వారా పునర్జన్మ లేని కర్మ శేషము లేని అన్ని రకాల రాహిత్యము పరమ ప్రశాంతత పొందే శాశ్వత మరణమై మోక్షము పొందుతామని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు కదా. ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. మీరు కృష్ణబిలంగా మారే అవకాశం మీకు ఎలా వచ్చింది అన్నప్పుడు మేము సర్వము ఏమీ లేదు.సర్వము శూన్యము.నేను లేను అనే సంకల్పంతో యోగనిద్ర సాధనం చేయడం జరిగింది కదా. మిగిలిన వారంతా కూడా కొంతమంది జగత్ సత్యమని నమ్మితే… మరికొంతమంది జగత్తు మిథ్య అని… మరి కొంతమంది జగత్ మిథ్య బ్రహ్మసత్యం అని నమ్మడం చేసినారు. అంటే వీరి సాధనలో ఒకటి సత్యము గాను మరొకటి అసత్యముగానే ఉన్నది. అదే మా సాధనలో అయితే రెండూ లేవు. ఏమి లేవు. ఏది సత్యం కాదు. ఏది అసత్యం కాదు. ఇదంతా కలలాంటి నిజం. నిజం లాంటి కల. జీవితమే అసత్యం అని తెలుసుకోవడమే జీవిత సత్యం అని మా సంకల్ప సాధన మొదలైనది. దానితో సర్వం శూన్యము. సర్వం ఏమీ లేదు అన్నప్పుడు మా దృష్టిలో జగత్తు బ్రహ్మము లేదు కదా. అమ్మ లేదు. అమ్మవారు లేదు .ఏమి లేదు అన్నప్పుడు మాయ కూడా లేనట్లే కదా. యద్భావం తద్భవతి అన్నమాట. మిగిలిన వారు అంతా ఏదో ఒకటి ఉన్నది అని అనుకుంటే మేమిద్దరము ఏమీ లేదు అని అనుకోవడం జరిగినది అన్నమాట. దానితో మాకు విశ్వకల ప్రపంచంలోనికి ప్రవేశించే అర్హత యోగ్యత లభించినాయి.కాకపోతే ఆది జన్మలోనే ఆదియుగంలోనే మేమిద్దరం ఈ విషయాలు తెలుసుకోవడం జరిగినది. కానీ అప్పుడు మాకు ఉన్న జ్ఞాన అహంకారము వలన నేను అపస్మారక స్థితి పొందితే తను తెలుసుకున్న ఆదియోగము సత్యాలు నిజమా అవునా కాదా అనే మీమాంస భయము వలన మా జిజ్ఞాసికి నాకు ఆదిలోనే ఆది జన్మలోనే అపస్మారక స్థితి పొందటంతో మేము తెలుసుకునే జ్ఞాన సత్యాలు మర్చిపోవడం జరిగినది. తిరిగి మూడు కోట్ల 12 లక్షలు 372 సాధన జన్మల తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత సాధన జన్మలో తిరిగి మా యోగనిద్ర సాధన అభ్యాసం ద్వారా 144 మంది మూలపురుషులు సహకారాల వలన మేము మర్చిపోయిన జ్ఞాన విషయాలను తిరిగి మా సాధన శరీరాల ద్వారా తెలుసుకుని ఆదిలో నేను కృష్ణబిలం గా మారితే అప్పుడు పొందిన అపస్మారక స్థితి వలన ఈ బిలం తిరగలేదు. ఈ జన్మలో తిరిగి జ్ఞాన స్పురణ పొందటంతో మోక్ష కృష్ణ బిలం సుడులు తిరగడం ఆరంభించింది. దానితో ఈ బిలము ఈ విశ్వం లో ఎక్కడ ఉందో సూచికగా మన జిజ్ఞాసి కాస్తా శూన్యబ్రహ్మయైన ధ్రువతారగా మారి ఈ బిల మార్గానికి అనగా మోక్ష మార్గానికి అదే శాశ్వత మార్గానికి దారి చూపించే నావికుడయ్యాడు. ఇలా ఈ విశ్వములో ఉన్న కోటాను కోట్ల కల ప్రపంచములు నెమ్మది నెమ్మదిగా నా మోక్ష కృష్ణ బిలం నందు ప్రవేశించడం ఆరంభమైనది.0.01% పర్సెంట్ నాశనం అవ్వడానికి అనగా కృష్ణ బిలంలోని న్యూట్రాన్ ల యొక్క కాంతి కాస్త కాంతిహీనంగా అవ్వడానికి సుమారుగా పది లక్షల 11 మిలియన్ల కోట్ల సంవత్సరాలు పడుతుందని గ్రహించాము. కాకపోతే ఈ సంవత్సరం 2019 జూలై 16 పౌర్ణమి నుండి ఈ కృష్ణబిలం అంతరించడానికి నాంది అయినది. అంతమే ఆరంభం అయినది. మర్చిపోయిన విషయాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞాపకంగా మిగిలిపోయింది. 
 
అంటే 118 సినిమాలోని అమ్మాయిని చంపుతున్నప్పుడు నన్ను మీరు చంపవచ్చు గానీ నేను తెలుసుకున్న రహస్యము లోకానికి తెలియ చేయాలనే నా ఆలోచన నా సంకల్పము మీరు నాశనం చేయలేరు. దానిని అందుకునే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా వస్తారు. అప్పుడు నిజము బయటపడక తప్పదని ఆమె చనిపోవడం జరుగుతుంది. అచ్చంగా ఇలాగే విశ్వసృష్టికి ఆదియోగి అయినా సదాశివుడు కూడా తను మరణించే విషయం లోకానికి తెలియజేయాలని ఆలోచనలతో చనిపోవడం జరిగినది. దానితో ఈయన కాస్త 36 కపాలధారి అస్థిపంజరంగా మిగిలిపోయినాడు. ఈ ఆలోచన జ్ఞానం ఆదిశక్తి అయినా సదాశివాని తన సాధన ద్వారా తెలుసుకుని ఆయనే లేనప్పుడు తాను ఉండటం అర్ధము లేదని శరీరత్యాగం చేసినది. అప్పటికే ఈ ఆదిదంపతుల వలన ఆదివిష్ణు ఆదిలక్ష్మి జననాలు జరిగినాయి. తమ మాతృపితృమూర్తులు పరమపదించిన విషయము వీళ్ళు తెలుసుకుని లోకానికి ఈ విషయం అందకుండా ఎన్నో రకాల మంత్రాలు మాయలు పెట్టి దాచి పెట్టి గుప్తముగా ఉంచి బ్రహ్మముడిగా ఉంచినారు.యధావిధిగా లక్ష్మీనారాయణులు విశ్వసృష్టి దేవతలుగా కొనసాగిస్తూ వచ్చారు. అంటే ఆదిదంపతులు అస్థిపంజరాలు సదాశివమూర్తి అస్థిపంజరమును బ్రహ్మరంధ్రము వద్ద గుహ యందు ఉంచితే అమ్మవారి శరీర త్యాగం వలన మూల కపాలముగా ఏర్పడితే దానిని బ్రహ్మరంధ్రము ప్రధాన ద్వారం వద్ద ఉంచడం జరిగినది. అందుకే సాధకునికి సాధనలో ఎప్పుడైతే హృదయ చక్రమును దాటి బ్రహ్మ నాడి ద్వారా బ్రహ్మరంధ్రము చేరుకున్నప్పుడు అక్కడ మనకి మూల ఏక కపాలము దర్శనమవుతుంది. ఇందు లోనికి ప్రవేశిస్తే కానీ ఆదిపరాశక్తి దర్శనమవుతుంది. అటువైపు దీప దుర్గ దీప కాళికా దేవి దీప చండీ మాతలు దర్శనం అవుతారు. ఇక్కడ విష్ణుమాయ ఉంటుంది. 36కపాలాలున్న సదాశివమూర్తి స్వరూపమును దీప  కాళిక యందు మాత్రమే ఉంచడం జరిగినది. ఎవరైనా పొరపాటున దీప దుర్గ దగ్గరికి వెళితే సాధకుడు తిరిగి పునఃసృష్టి చేయబడతాడు. అదే దీప చండీమాత దగ్గరికి వెళితే సాధకుడికి తిరిగి పునఃకర్మ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆమె ఆరాధన వలన రాజ్యాధికారము కలుగుతుంది.అనగా పునఃకర్మ ప్రదాత అన్నమాట. కాబట్టి ఉగ్ర స్వరూపమైన దీప కాళిక మాత అనుగ్రహమును సాధకుడు పొందవలసి ఉంటుంది. అప్పుడే 36 కపాలధారి సదాశివమూర్తి దర్శనము మనకి లభించదు. అటుపై ఈయనికి ఉన్న 36 కపాలాలలో 11, 9, 7, 5, 3, 1 వరుసలలో ఏక కపాల స్థితికి చేరుకుంటే దీనికున్న బ్రహ్మరంధ్రంలో అతి చిన్నదైన సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము దర్శనం మనకి లభిస్తుంది. ఇందులో సాధకుడి పంచ శరీరాలను దగ్దం చేసుకుంటే సాధన పరిసమాప్తి అవుతుంది. అనగా ఆది దంపతులు వలే మనము కూడా అంతమయ్యి పరమశూన్యమునందు లీనం అవుతాము. నిజానికి ఇదంతా కూడా మనం కల ప్రపంచంలోనే సాధన చేయవలసి ఉంటుంది. సాధకుడు యోగనిద్ర ద్వారా తమ సూక్ష్మశరీరమును తన లోపల ఉన్న బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము దాకా వెళ్ళవలసి ఉంటుందని గ్రహించండి. ఆది యోగి అయిన సదాశివమూర్తి అయిన నేను అనేది చనిపోయిన విషయమును దైవ ధ్యాన అనుభవం ద్వారా మాయా స్వరూపమైన స్థూల శరీరము తెలుసుకుంటే సాధన పరిసమాప్తి అయినట్లు అన్నమాట. అంటే ఒక రకంగా మనము చనిపోయిన విషయమును ఇప్పటికి మన స్థూల శరీరం గ్రహించడం లేదు. ఎందుకంటే అది జీవమాయలో ఉంది. తాను బతికే ఉన్నానని భ్రమ భ్రాంతిలో ఉంది. తను చనిపోయానని తను చనిపోతూ చేసుకున్న ఆలోచనే ఈ విశ్వ సృష్టి కలయని మన స్థూల శరీరానికి తెలియటం లేదు. మనం మరణించినట్లుగా మనకే తెలియదు కదా. మనలో శ్వాస ఆగిపోయినట్లుగా ప్రాణశక్తి పోయినట్లుగా మనము చనిపోతున్నప్పుడు మనకు తెలియదు కదా. ఈ విజ్ఞానం లోకానికి చెప్పాలని ఆదిపురుషుడైన సదాశివమూర్తి తను చనిపోయిన విషయం లోకానికి అందించాలని ఆలోచన చేసినాడు. దానితో అసత్యంగా కనిపించే ఈ సృష్టి కాస్తా సత్యంగా కనపడటం ఆరంభమైనది. ఈ ఆది ఆలోచన మనము ఏర్పడటానికి మూల కారణమైనది. ఇది తెలుసుకున్న వాళ్లు మోక్షప్రాప్తి పొందితే ఇది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ అవి చూపించే మాయలు ఆశలు భయాలు ఆనందాలు ఆలోచనలు సంకల్పాలు స్పందన కి గురి అయి అర్ధాంతరంగా ఆపివేసి ముక్తిని పొందుతున్నారు. అంటే ఇవి చూపించే మాయలో పడని వాడు మాయా రహితుడిగా మోక్షగామి అయితే వీటి మాయలో పడిన వాడు మాయా సహితుడై ముక్తి జీవి అవుతున్నాడు. అసలు ఈ విషయం తెలుసుకోవాలని ప్రయత్నించని వాడు మహామాయ భోగిగా మారుతున్నాడు. తాను ఏదో విషయజ్ఞానం అందుకోవాలని ఆలోచనతో సాధన చేసిన వాడు యోగి అవుతున్నాడు అన్నమాట. అంటే నిజానికి సాధన అనేది మన కల ప్రపంచంలోనికి ఆది జన్మ దాకా వెళ్లడం అన్నమాట. అనగా మూలాధార చక్రము నుండి విశుద్ధ చక్రము ద్వారా ఈ విశ్వ సృష్టికి ఆధారమైన మహా పంచభూతాల మాయలు సాధనా శక్తులు ఉంటాయి. వీటిని సాధకుడు తన కల ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో దాటవలసి ఉంటుంది. అలాగే ఆజ్ఞా చక్రం వద్ద కనిపించే దైవసాక్షాత్కారం అనేది ఆది జన్మలో పూజించిన దైవమని గ్రహించాలి. అలాగే సహస్రార చక్రము వద్ద కనిపించే ఆత్మసాక్షాత్కారం అనేది ఆది జన్మ ఏమిటో తెలుసుకోవచ్చును అన్నమాట. అలాగే హృదయ చక్రం వద్ద ఈ ఆది జన్మఏర్పడటానికి మన మూల కారణమైన కోరిక ఏమిటో తెలుసుకోవటం అన్నమాట. ఇక బ్రహ్మరంధ్రం వద్ద కనిపించే బ్రహ్మాండ చక్రంలో ఆదిలో అప్పటికే తను చనిపోయిన జ్ఞాన స్పురణను పొందటం జరుగుతుంది. ఆదిలోనే చనిపోయిన విషయం లోకానికి తెలియకుండా ఇన్నాళ్ళు మాయా స్వరూపాలు అయిన విష్ణు, దేవి మాయలు జాగ్రత్తగా మరుగున పరిచినాయి. ఇదంతా గూడ మీరు మీ యోగసాధనలో యోగనిద్ర సాధనలో ధ్యాన అనుభవాలు పొందుతూ తెలుసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు యోగనిద్ర సాధన అనే పేరుతో నిద్రపోతూ అసలు మీకు సంబంధించిన కల ఆదిలో ఏమి జరిగిందో మీ సూక్ష్మ శరీర యానంతో తెలుసుకోవడం యోగసాధన అవుతుంది. సాధకుడు యోగనిద్ర పొందిన సమాధి స్థితిని పొందిన కూడా నిద్రలోనే కలలోని తన సూక్ష్మ శరీర యానం ద్వారా దైవ అనుభవాలు పొందక తప్పదు అని గ్రహించండి.భోగ నిద్రలో జరగబోయే సంఘటనలు తెలిస్తే అదే యోగనిద్రలో అసలు ఏమి జరిగిందో తెలుస్తుంది. మీ కల ప్రపంచములోనికి  మీ సూక్ష్మ శరీర యానం చేసినప్పుడు అప్పుడు కనిపించే ధ్యాన దృశ్యాలకు మీరు భయపడిన బాధ పడిన ఆలోచనలో పడిన వాటికి స్పందించిన వాటిని చూసి సంకల్పించుకున్న వాటిని చూసి ఆనందపడిన మీకు మీరే మాయలో పడటం జరుగుతుంది. ఉదాహరణకు మీరు గత జన్మలో పంది అని తెలిస్తే తట్టుకోవాలి. బాధపడకూడదు. అదే గత జన్మలో మీరు దేవుడు అని తెలిస్తే ఆనంద పడకూడదు. ఎందుకంటే నేనే దేవుడు అనే అహం ఈ జన్మలో మీకు మొదలవుతుంది. అదే గత జన్మలో మీరు తాంత్రిక యోగులైన కాపాలికులు లేదా అఘోరులని తెలిసినా భయపడకూడదు. అదే గత జన్మలలో మిమ్మల్ని ఎవరైనా చంపినట్టుగా కనపడితే దానిని చూసి మీరు స్పందించి వారిని ఎలాగైనా చంపాలని అనుకోకూడదు. అదే గత జన్మలో మీకు ఎవరైనా హాని చేసినట్లుగా కనబడితే దానిని చూసి వారిని చంపాలని సంకల్పాలు చేయకూడదు. ఎందుకంటే ఇదంతా గత జన్మలో జరిగిపోయిన రికార్డు దృశ్యాలు కల అని తెలుసుకోవాలి. ఒకవేళ మీరు గత జన్మలో ఏవైనా చూసిన వాటికి స్పందించిన పై పనులకు స్పందనలు చేస్తే దానికి తగ్గట్లుగా బహుశా ఈ జన్మలో మరి కొత్తవి ఏర్పడతాయని గ్రహించండి. అందుకే సాధకుడికి సమదృష్టి సమదర్శిని తత్వ దర్శనం తత్వమసి మనోధైర్యం అచంచల భక్తి విశ్వాసాలు శరణాగతి త్యాగము క్షమ ఇలా మనకు 18 రకాల దైవిక లక్షణాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. కారణము సాధకుడు ఎప్పుడైతే తన యోగ సాధనను అనగా తన కల ప్రపంచంలోనికి అడుగు పెడతాడో వాడి గత జన్మ వివరాలు తెలుసుకోవడం ఆరంభము అయినట్లు అన్నమాట. అంటే ఆయా జన్మలలో ఆయా సమయాలలో జరిగిన రికార్డ్ దృశ్యాలను చూసిన సాధకుడు చలించకుండా భయపడకుండా ఉండాలని మనోధైర్యంతో ఉండాలని చెప్పడం జరిగినది. అలాగే తన గత జన్మలలో జంతువు జన్మల దృశ్యాలు వచ్చినప్పుడు అవి కూడా మనలాంటి ప్రాణులే కదా అనే దృష్టితో చూడాలని సమదృష్టి లక్షణము చెప్పడం జరిగినది. అలాగే గత జన్మలో మనం వివిధ రకాల మతాలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు వ్యక్తులుగా కనపడితే అందరూ కూడా సమానం అని తెలుసుకోవడమే సమదర్శి లక్షణం ఉండాలని చెప్పడం జరిగినది. గత జన్మ లో ఎవరైనా మీకు హాని చేసిన వ్యక్తులు కనబడితే వారిని చూసి క్షమించాలని క్షమాగుణము కలిగి ఉండాలని చెప్పడం జరిగినది. ఇలా ప్రతి సాధకుడికి 18 లక్షణాలు ఉంటే వారి కల ప్రపంచములోని దృశ్యాలను చూసి భయపడడు బాధపడడు ఆనందపడడు. ఇదియే స్థితప్రజ్ఞత తత్వమసి అద్వైత స్థితి అన్నమాట. ఇదియే బ్రహ్మ తదాకార స్థితి.అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆది జన్మలో మనం రాసుకున్న జీవిత డైరీని ఈ జన్మలో చదవటమే యోగసాధన అన్నమాట. చదువుతున్నప్పుడు స్పందించకుండా బ్రహ్మ తదాకార స్థితిలో నిశ్చలముగా సాక్షి భూతంగా మౌనంగా ఉండడమే యోగసాధన పరిసమాప్తి అన్నమాట. అదియే మోక్షం. తన జీవితమును చదువుతూ సగంలో ఆపేసిన వాడు పొందేది ముక్తి అవుతుంది. అసలు అతని జీవిత డైరీ చదవాలని తెలియని వాడు భోగి అయితే చదవాలని అనుకునే వాడు యోగి అవుతాడు. ఇంతకంటే మీకు ఇంకా సులువుగా చెప్పాలి అంటే యోగ సాధన అంటే ఏమిటో తెలుసుకోవాలి. 

 
యోగ సాధన అంటే అదేదో అనుకుని కంగారు పడకండి.భయపడకండి. బాధపడకండి. యోగనిద్రలో సాధన చేయడమే అనగా మర్చిపోయిన మీ గత జన్మల జ్ఞాన అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అసలు సిసలైన యోగసాధన అవుతుందని గ్రహించండి. ఎంత యోగి అయిన ఎంతటి పరమగురువు అయిన ఎంతటి దైవం అయిన ఎంతటి సాధకుడు అయినా ఎంతటి  భోగి అయినా ఈ స్వప్నముల ద్వారానే అనుభూతిని పొందక తప్పదు అని గ్రహించండి. భోగి అయితే భోగ నిద్ర ద్వారా అనగా కలల ద్వారా అనుభవాలు పొందితే యోగి అయితే యోగనిద్ర ద్వారా జ్ఞాన అనుభవాలను పొందడం జరుగుతుందని తెలుసుకోండి. భోగి అయితే పాపకర్మల నివారణ అయితే అదే యోగి అయితే ప్రారబ్డ కర్మలు నివారణ అవుతాయని గ్రహించండి. అంటే సాధకుడు తన యోగనిద్రకి తగినంత సమయం కేటాయించటం లేదంటే మాయలో ఉన్నట్లే. అనగా మనస్సు వారికి తెలియకుండా దశేంద్రియాలు చూపించే అరిషడ్వర్గాల మాయలో ఏదో ఒక మాయ లో ఉంటే మనకి యోగనిద్ర రాదు. అనగా నిద్ర మెలకువ స్థితి కలగదని గ్రహించండి. ఇలాంటి స్థితిలో నిద్ర కలిగితే యోగనిద్ర అని అదే ధ్యానములో కలిగితే సమాధిస్థితి అని తెలుసుకోండి. యోగనిద్ర యొక్క పరాకాష్ట సమాధి అన్నమాట. అంటే ప్రారంభ సమాధిస్థితి యోగనిద్ర అన్నమాట. 21 నిమిషాల పాటు ఈ నిద్ర మెలకువ స్థితిలో ఉంటే పూర్ణ యోగనిద్ర అయితే అదే 48 నిమిషాల పాటు ఉండే సమాధి స్థితి అని తెలుసుకోండి. ఇంతకుమించి సాధన లేదు. మాయ లేదు. యోగ నిద్ర రాని వాడు మాయ సహితుడు. యోగ నిద్ర పోయేవాడు మాయా రహితుడు. అదే సంపూర్ణ యోగనిద్ర. అనగా విశ్రాంతి ఆలోచన స్థితిని పొందేవాడు అనగా జితేంద్రియుడు అన్నమాట. మనో ఇంద్రియాల ని గ్రహస్థితిని పొందిన వాడు అన్నమాట.  వీరే విశ్వబ్రహ్మ అయ్యి విధాత విశ్వాధినేత అన్నమాట.ఒకటి గుర్తుంచుకోండి. మీ మనస్సు దేనియందు ఎవరి యందు ప్రేమ, మోహం, వ్యామోహం, ఆనందము, ఆశ, భయము పడనంతవరకు మీరు మాయలో లేనట్లే. యోగ సాధనకి దగ్గరగా ఉన్నట్లే. తద్వారా సాధన పరి సమాప్తికి అర్హత యోగ్యత ఉన్నట్లేనని గ్రహించండి. కేవలం మీరు వీలున్నప్పుడు వీలయినంత సేపు విశ్రాంతిగా మీ మనస్సుకి అలాగే మీ శరీర అవయవాలకి తగినంత విశ్రాంతిని ఇస్తూ మీలో వినిపించే నాదాలు వింటూ ఎలాంటి మంత్రోచ్ఛారణ చేయకుండా కేవలం నిద్ర మెలకువ స్థితిలో ఎంత సేపు ఉండగలుగుతారో అంత సేపు ఉండి ప్రశాంత వదనము స్థితిలో విశ్రాంతిగా ఉండండి. అంతే. మీ సాధన పరి సమాప్తి అవుతున్నట్లే. మీరు శాశ్వతమైన మోక్షపధం అనగా నిశ్చల స్థితికి వెళుతున్నట్లు లెక్క. కాకపోతే బలవంతంగా యోగనిద్రలోకి వెళ్ళవద్దు. అలాగే బలవంతంగా ఉండవద్దు. ఎప్పుడు మీకు విశ్రాంతి నుండి బయటికి రావాలనిపిస్తే వచ్చేయండి. ఆ తర్వాత మీరు మీ భోగ జీవితం లోనికి వచ్చి మీకు నచ్చిన విధంగా మీకు కావలసిన విధంగా ఉండవచ్చును. కాకపోతే అదే అలవాటు వరకే మాత్రమే చేసుకోండి.లేకపోతే ఈ అలవాటే అవసరం అవుతుంది అని గ్రహించండి. అప్పుడు మీ మనస్సు కాస్త ఈ అలవాటు యందు ప్రేమ మోహం వ్యామోహం ఆశ ఆనందం పడేస్థితికి మీకు తెలియకుండా వెళుతుంది. అంటే మీరు యోగనిద్రకు దూరమై మాయకి దగ్గర అవుతారని గ్రహించండి. మళ్లీ ఈ అవసరమును అలవాటుగా మార్చుకుని దానిని అదుపులో తెచ్చుకుంటే మళ్ళీ మీరు మాయకి  దూరమై యోగనిద్రకి దగ్గర అవుతారని గ్రహించండి. ఉదాహరణకు మీకు తాగాలని అనిపిస్తే కావాల్సిన దానిని ఆనందంగా తాగండి. అనుభవించండి. తృప్తి చెందండి. అప్పుడప్పుడు దీనిని అలవాటు చేసుకోండి. అనగా ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు తాగటం పెట్టుకోండి. అంతవరకు పరవాలేదు. అంతే గాని మనస్సు బాగాలేదని తాగడం మొదలు పెడితే అది కాస్త అలవాటయ్యి తాగడానికి కారణాలు వెతుక్కుని మరీ తాగటం మొదలయ్యి అలవాటు కాస్త అవసరం గా మారితే నిత్య తాగుబోతులు అవుతారు. అప్పుడు మీకు వచ్చేది యోగ మత్తు. యోగనిద్ర కాదు. జోగు మత్తు మాయా నిద్ర అన్నమాట. తద్వారా మీరు యోగనిద్రకి దూరం అవుతారు. ప్రశాంత స్థితి నుండి అశాంతికి మీకు తెలియకుండానే చేరుతున్నారని గ్రహించండి. కాబట్టి ఏదైనా అలవాటు వరకే అనగా మీ అదుపు ఆఙ్ఞలలో ఉన్నంతవరకు ఉంటే ఏమాయ మిమ్మల్ని ఏమీ చేయదు.ఏ ప్రారబ్ద కర్మ ఏమీ చేయదు.ప్రారబ్ద కర్మ వలన అలవాటే కాస్త అవసరాలుగా మారతాయని తెలుసుకోండి. ఎప్పుడైతే అవసరాలకు మారినాయో అది కాస్తా వ్యసనాలుగా మారుతాయి. దాంతో వాటిని మానలేక సాధన చేయలేక మాయలో పడిపోతారు. ఇంద్రియ నిగ్రహం పొందవలసిన వాడు కాస్త ఇంద్రియాల లోలతకు గురై సాధన జీవితంను అర్ధాంతరంగా ఆపుకోవాల్సి వస్తుంది. కాబట్టి సాధకుడు ఏవి మాయలు ఏవి యోగశక్తులో తెలుసుకుని వాటిని తమ అదుపాజ్ఞలలో తన దశేంద్రియాలను ఉంచుకోగలిగితే సాధన సగం పూర్తి అయినట్లు అని గ్రహించండి. యోగి వేమన మొదటి లో కామభోగి కదా. ఎప్పుడైతే తన వదినమ్మ నగ్న శరీరం చూసినాడో దానితో కామము మీద నగ్న దేహం మీద స్మశాన వైరాగ్యం చెంది కామి కాస్త మోక్షగామి కాలేదా. ఈయన అనుభవించాడు. వాటిని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుని దాటినాడు అన్నమాట. ఇలా ఉండటం అందరికీ సాధ్యం కాదు. జీవితమే అసత్యమని గ్రహించడమే జీవిత సత్యం అని తెలుసుకున్న అనుభవ నిజ బ్రహ్మ జ్ఞానికి మాత్రమే దశేంద్రియాలను అదుపులో ఉంచుకుని జితేంద్రియ స్థితిని పొంది సాధన పరిసమాప్తి చేసుకొని జయం పొందుతాడు. ఇలాంటి జితేంద్రియ స్థితి మీరు పొందాలంటే మీరు దశేంద్రియాలను అదుపులో ఉంచాలి. ఇవి అదుపులోకి రావాలంటే మీ మనస్సు మీకు ఆధీనము అవ్వాలి.అంటే అది స్థిర మనస్సుగా వివేక జ్ఞానము ఏకాగ్రత రావాలి. ఇవన్నీ కూడా సిద్ధించాలంటే మీరు యోగనిద్రలో అభ్యాస సాధన చెయ్యక తప్పదు. అందులో జయం పొందితే ఈ స్వప్న విశ్వ సృష్టి లోని స్వప్న జీవ నాటకం లోని మీ స్వప్న పాత్ర లేకుండా ఉండాలి అంటే మీరు యోగనిద్ర ద్వారా స్వప్న సాధన చేసిస్వప్నసాధకుడిగా మారాలి. జయం పొందాలి. ఒకటి గుర్తుంచుకోండి.సహజసిద్ధమైన యోగనిద్ర అనేది అనగా నిద్ర మెలకువ గా ఉంటే మగత నిద్ర అనేది ఇది మనకు సహజంగా తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాలకు బ్రహ్మ ముహూర్త కాలం లో ఏర్పడుతుంది. ఈ సమయాలలో గృహ సాధకులు అలాగే బ్రహ్మచారులు యోగసాధన చేయవచ్చు. అలాగే బ్రహ్మచారులు అయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య కాలంలో చేస్తే సత్ఫలితాలను  పొందవచ్చునని గ్రహించండి. కాకపోతే యోగనిద్ర సాధన సమయంలో మనకు ఎలాంటి అవాంతరాలు కలగని సమయాల్లో చేస్తే మంచిది. ఈ స్థితిలో నికి వెళుతున్నప్పుడు మనము భయపడిన లేదా బయటనుండి అవాంతరాలు ఏర్పడితే మనము త్వరగా మామూలు స్థితికి రాలేము. ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. 

 
 
మీకు ఈ యోగనిద్ర గురించి వాటి అనుభవాల గురించి తెలియాలంటే 118 సినిమా, అంతర్వేదం సినిమా, నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం సినిమా ,సూర్య నటించిన 24 సినిమాలు చూడండి. మీకే తెలుస్తాయి. అలాగే వశం అనే సినిమా చూడండి. ఇష్ట కోరిక మాయా ప్రభావం యెట్టిదో తెలుస్తుంది. స్వప్న సాధనతో స్వప్న సాధకుడిగా మీ స్వప్న సాధనను సంపూర్ణముగా పరిసమాప్తి చేసుకోండి. జయం పొందండి. ఇంతకి మరి నా సాధన ఎలా పరిసమాప్తి అయ్యినదో మీరు తెలుసుకోవాలంటే ... దానికి మీరు నాతోపాటుగా నా ఆఖరి అంతిమ మజిలి అయిన ముగింపు ఆధ్యాత్మిక యాత్ర చెయ్యండి.

శుభంభూయాత్

పరమహంస పవనానంద
***************************
గమనిక:ఈ గ్రంధారంభములో నాకు కాపాలకుడి రూపములో దత్తదర్శనం అలాగే శ్రీ శైల అమ్మవారి దర్శనాలు..ఇలా నాకు వివిధ క్షేత్రాల యందు నామరూప దైవ దర్శనాలు కల్గినట్లుగా అదిగూడ సాధన పరిసమాప్తి గాకుండానే ఎలా జరిగినాయని మీకు సందేహము వచ్చి ఉండాలి గదా! అంటే ఇవన్నీ గూడ గత జన్మలలో నేను సాధన అసంపూర్తిగా చేసి మరణమును పొందడముతో...వీటిని ప్రస్తుత సాధన జన్మ ద్వారా యోగనిద్ర సాధన ద్వారా తెలుసుకొని...ఆయా క్షేత్రాలకి వెళ్ళినపుడు అపుడు మిగిలిపోయిన సాక్షాత్కారాలు ఇపుడు అయ్యినాయని మీకు ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా. అలాగే ఆయా గతజన్మలలో రావల్సిన దైవిక వస్తువులు ఇపుడు ఈ జన్మలో తిరిగి పొందడము జరిగినది. అలాగే గతజన్మలలో ప్రత్యక్ష్యంగా కైలాస పర్వతము వద్ద సదాశివమూర్తికోసము మరియు అరుణాచల క్షేత్రమునందు మేధా దక్షిణామూర్తికోసము మరియు మృడేశ్వర క్షేత్రమునందు సాంబశివమూర్తి అతిఘోరాతి ఘోరముగా తపస్సు చెయ్యడము వలన ప్రస్తుత సాధన జన్మ వలన నా సూక్ష్మయానము ద్వారా వీరిని ప్రతక్ష్యంగా చూసే అవకాశమును కల్పించినారు.ఇలా కొన్ని కోట్లాను కోట్ల జన్మలలో ఏదో మాయలో పడి నా సాధన ఆగిపోవడము జరిగినది.కాని ఈ యోగనిద్ర సాధన ద్వారా గత జన్మలలో చేసిన పొరబాటు చెయ్యకూడదని... అన్నిరకాల స్వప్న సాధన మాయలను దాటుకోవడము జరిగినది.ఆకార పరబ్రహ్మము నుండి శూన్యబ్రహ్మ స్ధాయికి చేరుకొని అటుపై శూన్యబిందువు నందు లయం చెంది నా సాధనను పరిసమాప్తి చేసుకోవడము జరిగినది. అంటే ప్రస్తుత జన్మ సాధన అంతా ఒక కంప్యూటర్ కి ఎలాయితే బప్ఫరింగ్ చేస్తారో అనగా ఇది చెయ్యడము వలన ఎక్కడోక్కడో దాచిన సమాచారమును ఒక పద్దతిలో అమర్చుకోవడము ఎలా జరుగుతుందో… అలా మా కోట్లానుకోట్ల జన్మలలో చేసిన కర్మఫలితాలను ఈ జన్మసాధన అయిన యోగనిద్ర సాధన ద్వారా వాటి అన్నింటిని ఒకచోటుకి ఒక వరుస క్రమములో అమర్చుకుంటూ...ఆయా జ్ఞానస్ఫురణలు పొందుతూ..వాటినిఎప్పడికి అపుడు డైరీలలో ఎక్కిస్తూ వచ్చినాము.ఆఖరికి నేను లేను స్వానుభవము పొందడముతో మా సాధన పరిసమాప్తి అయింది.

1 కామెంట్‌:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి