అధ్యాయం 28


స్త్రీలు మాయలా?
(మా కర్మమార్గం)

నేను ఎవరిని అనే ప్రశ్నసాధన దెబ్బకి… మేమిద్దరం యోగ సాధన కోసం కర్మ మార్గం లోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము! నిష్కామ కర్మ అనగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మ విధి విధానము ద్వారా మాకు తోచిన సమాజ సేవ చేయాలని…. మానవసేవే మాధవ సేవ మార్గం లోనికి అడుగు పెట్టి …ఎవరో ఒక అమెరికన్ ఇండియన్ వ్యక్తి  పేద ప్రజలకు ఉచిత సేవ తో ఆసుపత్రి పెట్టి సేవలు చేస్తున్నారని…. మా ఊరికి దగ్గర్లో ఉన్న చోటనే ఇది ఉందని తెలుసుకుని… ఆ ఊరి ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరడం జరిగింది! నా తొలి జీతం ఎంతో తెలుసా 325 రూపాయలు! ఇంతవరకు బాగానే ఉంది! నేను చేస్తున్న గాయత్రీ ఉపాసన వలన నాలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి….. నా చుట్టూ ఉండే ఆసుపత్రి నర్సులను ఆకర్షించటం మొదలైంది! 

మొదటిలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు! ఎందుకంటే నా జీవితంలో జరిగిన తొలి ప్రేమలో అనుభవాలకి…. ఆడవాళ్లకు దూరంగా ఉన్నాను! వారిని ఎంత దూరంగా ఉంచినను…. వారికి తెలియకుండా వారు నా దగ్గరికి… ఏదో కావాలని మాటలు కలపడం మొదలుపెట్టినారు! ఒకేసారి సుమారుగా నలుగురు ఐదుగురు నర్సులు నా చుట్టూ చేరి… ఏవో కబుర్లు చెబుతూ… ఆసుపత్రులు పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళం! మాటలు పెరిగితే స్నేహాలు పెరుగుతాయి కదా! స్నేహాలు పెరిగితే ప్రేమ భావాలు కూడా పెరుగుతాయి కదా! వాళ్ళలో కొంతమంది నా మీద ఆశలు పెట్టుకోవడం ప్రారంభించారు! ఆశలు పెట్టుకోవడం ఆరంభించినారని తెలిసి నాకేమో బుర్ర తిరిగేది! ఇక్కడేమో నిష్కామ కర్మ చేయాలని… ఆసుపత్రికి చేరితే …. ఈ నర్సుల వలనే  ప్రేమ పాఠాలు, కామ పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది! తాటి చెట్టు కింద పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరు కదా! ఖచ్చితంగా నువ్వు కల్లు తాగుతున్నా వు అని… నర్సులకి నాకు మధ్య స్నేహభావాలున్నప్పటికి… కొంతమంది నమ్మక మామధ్య ఇంకా ఏదో ఉన్నదని అంటూ ఏవో లేని పోని ప్రచారాలు చేయడం మొదలు పెట్టి నారు! అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో నేను ఉండగా మళ్లీ నా దగ్గరికి జిజ్ఞాసి వచ్చినాడు! విషయం తెలుసుకున్నాడు! వాడేమో నిష్కామ కర్మ కోసం ఉచితంగా ఏవో ఎడ్యుకేషన్ సిడిలు తయారు చేసి…. పేద విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నాడని.... కాని కొంతమంది కంపెనీలు ఇలా ఉచితంగా పంచితే మేము నష్టపోతామని వీడిని బెదించడము చేస్తున్నారని తెలుసుకున్నాను! వీడి పని బాగుంది అనుకున్నాను! ఇంతలో వాడు రామకృష్ణపరమహంస జీవిత చరిత్ర పుస్తకం నా చేతిలో పెట్టి…. విషయం ఏమిటో తెలుస్తుంది అన్నాడు! వెంటనే చదవడము మొదలు పెట్టినాను! అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే… యోగసాధనకు స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము ఆటంకాలుగా నిలుస్తాయని తెలుసుకున్నాను! వామ్మో! అంటే సాధనకి అనగా పురుష సాధకునికి స్త్రీలు…. అలాగే స్త్రీ సాధకు రాలికి పురుషులు మహా మాయగా నిలుస్తారని తెలుసుకున్నాను! ఇది ఎలా నిజమో నాకైతే అర్థం కాలేదు! స్త్రీలు మాయలు అయితే బ్రహ్మ దేవుడు ఎందుకు ఇంత అందంగా వీరిని కష్టపడి సృష్టిస్తాడు! అది నిజము కాదు అనుకుని నేను పప్పులో కాలు వేశాను! నర్సులతో  స్నేహాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాను! అందులో ఒకటి కాలు కాల్చుకుని నా మీద ఎంత ప్రేమ ఉన్నదో చూపించేసరికి …. నా బుర్ర తిరిగినది! నిజం చెప్పాలి… ఎవరైనా ప్రేమలో లేదా స్నేహంలో ఉంటే…. అది ఒక్కటే వారికి కనపడుతుంది… మరొకటి ఏదీ కూడా గుర్తుకు రాదు! నేను కూడా వీరందరి నర్సుల స్నేహములో ఉన్నప్పుడు… నాకు దైవపూజలు గుర్తుకు రాలేదు! ప్రతి రోజూ చేసుకునే గాయత్రి మంత్రం డుమ్మా కొట్టే వాడిని! వాయిదాలు వేసే వాడిని! ఎప్పుడూ వారి కోసం ఎదురుచూపులు! ఆసుపత్రికి రోగులు ఎవరూ రాకుండా ఉంటే బాగుండును అని దైవ ప్రార్థనలుమాత్రం ఉండేవి! ఎందుకంటే రోగులు లేకపోతే నర్సులు ఖాళీగా ఉంటారు కదా! అప్పుడు ఎక్కడాలేని బోలెడు విషయాలు, బుంగ మూతులు, బండ బూతులు, కవ్వింపులు ఇలా జరుగుతూ ఉండేవి! నాతో పాటుగా మరి కొంతమంది పురుషులు కూడా ఈ నర్సులు కవ్వింపులు మాటల కోసం పడి చచ్చే వారు! రాను రాను వీరి జీవితమే నా జీవితంగా మారిపోయింది! నా మంత్ర సాధన గంగలో కలిసిపోయింది! 

ఇంతలో ఒక రోజు అనుకోకుండా ఒక రోగి తన చేతికి లోతైన గాయం అయిందని…. మిట్టమధ్యాహ్నం వచ్చినాడు! గాయం చూస్తే చాలా లోతుగా ఉంది! ఖచ్చితంగా కుట్లు వేసే పరిస్థితి! కానీ అక్కడ ఉన్న నర్సుకు ఎలా కుట్లు వేయాలో తెలియదు! డాక్టర్ పైన ఉన్న ఆయన గదిలో నిద్రపోతున్నారు! ఏమి చెయ్యాలో మా ఇద్దరికీ పాలుపోలేదు! వెంటనే నర్సు ను… డాక్టర్ దగ్గరికి పంపితే… “ఇప్పుడు చూడను! చూసే సమయం దాటిపోయింది! సాయంత్రం రమ్మను! లేదంటే వేరే ఆస్పత్రికి వెళ్ళమని” చెప్పినాడు! ఇదే విషయం ఆ రోగికి చెబితే… “బాబు! వేరే ఆస్పత్రికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా! కనీసం రెండు గంటలైనా పడుతుంది కదా! ఈ లోపల ఈ గాయం నుండి రక్తం పోకుండా ఉంటుందా?” అన్నాడు! అది నిజమే అనిపిస్తుంది! రోగి రానురాను నీరసం పడిపోతున్నాడు! ఎన్ని కట్టులు వేసిన రక్తం ఆగటంలేదు! డాక్టర్ పై నుండి కిందికి రావటం లేదు! ఏమి చెయ్యాలో మా ఇద్దరికీ పాలుపోవడం లేదు! ఇంతలో ఆమె వెంటనే తనకు తెలిసిన సీనియర్ నర్సుకి ఫోన్ చేసి కుట్లు ఎలా వేయాలో… తెలుసుకుంటూ…. చివరికి ఆ రోగికి కుట్లు వేసినది! నాకు ఆనందమేసింది! ఈమె మీద కృతజ్ఞతాభావం కలిగినది! డాక్టర్ మీద అసహ్యం కలిగింది! వైద్యో నారాయణ హరి అంటారు కదా! రోగి వచ్చినప్పుడు రోగికి సేవ చేయకుండా…. ఆ సమయానికి రా… ఈ సమయానికి రా…. చెప్పినాడని నాకు విపరీతమైన కోపం వచ్చింది! సాయంత్రం ఇదే విషయాన్ని డాక్టర్ తో అన్నాను! దానికి ఆయన అవమానపడి “ఒక ఎమ్మెస్ డాక్టర్ తో మాట్లాడుతున్నావు అని తెలుసుకో! నీ అంతు చూస్తాను! నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను” అంటూ… ఆసుపత్రి చైర్మన్ దగ్గరికి వెళ్లి “అసలు విషయం చెప్పకుండా దాచి పెట్టి … మా ఇద్దరి మీద లేనిపోని విషయాలు” చెప్పినాడు! దాంతో ఆయన అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టడం… అందులో నాదే తప్పు ఉన్నదని…. అనుభవం ఉన్న డాక్టరిని గౌరవించకుండా... అనుభవములేని నర్సును ఎందుకు గౌరవిస్తున్నావో… మాకు తెలుసులే అని వ్యంగ్యముగా...అదో టైపుగా మాట్లాడేసరికి … అక్కడ ఉండలేక, ఇమడలేక నిష్కామ సేవ చేయాలని అనుకుంటే…  అది కాస్త అహం మీద దెబ్బ తగిలినట్లుగా అనిపించి… ఉద్యోగానికి రాజీనామా చేసి…. మా ఊరికి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాను!
 మా ఊరి బస్సు ఎక్కిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టినాను! ఆమె మీద నాకున్న స్నేహ మాయ వలన… ఆమె మీద కృతజ్ఞతా భావం ఏర్పడింది! దానితో ఆ రోగికి కుట్లు వేయడానికి కావలసిన వస్తువులు నేను ఇవ్వటం జరిగినది! అది కూడా డాక్టర్ అనుమతి లేకుండా ఇవ్వటం జరిగినది! అది తప్పే కదా! అనుభవం లేని నర్సు చేతిలో ఒక రోగి ప్రాణాలు ఉంచటం ప్రమాదమే కదా! నా అదృష్టం బాగుండి….  అది చిన్న గాయం కావడం వలన… అది తెలిసి తెలియకుండానే వేసిన కుట్లు సరిగ్గా పడటం వలన బాగానే ఉంది ! ఒకవేళ కుట్లు తప్పు పడితే… ఆ రోగికి చెయ్యి తీయ్యవలసిన పరిస్థితి వస్తే… వామ్మో ఊహించటమే చాలా కష్టంగా ఉంది! రామకృష్ణ పరమహంస చెప్పినది నిజమే కదా! సాధనలో ప్రతి పురుషుడికి ఒక స్త్రీ మూర్తి అలాగే ప్రతి స్త్రీ మూర్తి సాధకులకు పురుషుడు తప్పకుండా మాయ అవుతాడు అని నేను గ్రహించాను! ఈ మాయలో ఉన్నంతవరకు మన మనస్సు వేరే వాటి గురించి ఆలోచించదు! దైవాన్ని గురించి పట్టించుకోదు! సాధన గురించి అసలు పట్టించుకోదు! దానితో నాకు ప్రేమ వివాహం అయ్యే దాకా…. మరో స్త్రీ మూర్తిని చూడరాదని, చనువు ఇవ్వకూడదని, స్నేహము చేయరాదని, ఏకపత్నిధర్మముతో గృహస్థ ఆశ్రమ జీవితం గడపాలని…  సంకల్పంతో నిశ్చయించుకుని ఆనందంగా మా ఊరికి బయలుదేరినాను!

 ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకోసం వస్తున్న జిజ్ఞాసి కనిపించగానే…. బస్సు ఆపించి వారిని ఎక్కించుకొని… మేము మా ఊరికి బయలుదేరినాను! అన్ని విషయాలు వాడితో చెప్పినాను! వాడు ఏమీమాట్లాడలేదు! ఆ తర్వాత వాడితో నేను “మిత్రమా… నువ్వు ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదా?” అన్నాను! దానికి వాడు “నేను అందరినీ ప్రేమిస్తాను! నా ప్రేమను పంచుకునే… తట్టుకునే వారే లేరు! ఎందుకంటే నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను! నా ప్రేమ ఒకరితో, ఒకరికోసం ఉండదు! ఆగదు! నేను అమ్మాయిని ప్రేమిస్తాను! అబ్బాయిని ప్రేమిస్తున్నాను! కుక్కని ప్రేమిస్తాను! కుర్చీని ప్రేమిస్తాను! నా ప్రేమలో లింగ భేదాలు, వస్తువు భేదాలు ఉండవు” అన్నాడు! “వామ్మో కొంపతీసి వీడు తేడా గాడు కాదు కదా…. అందర్నీ ప్రేమిస్తాం అంటాడు! పైగా అమ్మాయిలని కాకుండా అబ్బాయిలని కూడా ప్రేమిస్తాను అంటున్నాడు! వామ్మో! వీడికి స్వాతి వారపత్రిక లోని మధ్య పేజీ ఖచ్చితంగా చదివించాలి! లేదంటే వీడు కాస్త తేడాగా మారిపోయే ప్రమాదం ఉంది!” అనుకుని వాడితో “మిత్రమా! నువ్వు ఒకసారి ఎప్పుడైనా స్వాతి వారపత్రిక లోని మధ్యపేజీ చదువు” అన్నాను! దానికి వాడు వెంటనే “ఏముంటుంది అందులో! నేను ప్రతివారం చదువుతూ ఉంటాను! అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా! నాకు ఇది ఫలానా విషయం ఇది తెలుసుకోవాలి… ఫలానా విషయం తెలుసుకోకూడదు అని ఆలోచన ఉండదు! వాత్సాయన కామ శాస్త్రము చదివాను అలాగే వాల్మీకి రామాయణము చదివాను! వ్యాసుడు భారతం చదివాను! దేవదాసు సినిమా చూశాను! వారంతా వారి వారి విషయ పరిజ్ఞానము పొంది పరిపూర్ణు లైనారు! జయం పొందినారు! నీకు అవి కామ పాఠాలుగా, గుణపాఠాలుగా అని విడిగా కనపడతాయి! అన్నాడు! నేనయితే వెంటనే అతనితో “ఎప్పుడైనా ఒక స్త్రీమూర్తిని నగ్నంగా చూశావా?” అన్నాను! దానికి వాడు వెంటనే “నేను రోజూ చూస్తూనే ఉంటాను! నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు! నువ్వు నగ్నత్వం అనేది కేవలం స్త్రీ మూర్తి లోనేచూస్తున్నావు! నేను ప్రతి స్త్రీ జాతిలోనూ అనగా కుక్కలలోను, పిల్లిలలోను, ఆవులలోను, గెదేలలోను,మేకలోను,గొర్రెలోను నగ్నత్వం అనేది చూస్తున్నాను!” అన్నాడు! వామ్మో! వీడు ఏమిటి ఇంత తేడా గా మాట్లాడుతున్నాడు అనుకుని…. “మరీ చెపుతావు! కుక్క పిల్ల కి …ఆడపిల్ల కి తేడా ఉండదా”? అన్నాను! దానికి అతను వెంటనే “కుక్కపిల్ల బట్టలు వేసుకోదు! ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంది! అంతే తేడా! నా దృష్టిలో ఆడపిల్ల బట్టలు విప్పితే… నాకు ఆ కుక్క లో కనిపించే నగ్నత్వం ఆడపిల్ల లో కనపడుతుంది! నాకు తేడా కనిపించదు! రెండు కూడా స్త్రీ జాతి మూర్తులే కదా… అన్ని రకాల స్త్రీ జాతులలో నగ్నత్వం అనేది ఒకటే కదా!” అన్నాడు! వామ్మో! వీడు మాటలకి నా బుర్ర వేడెక్కింది! వాడికి ఏమి సమాధానం చెప్పి ఒప్పించాలో అర్థంకాక కళ్ళు మూసుకుని మౌనంగా నిద్రలోకి జారుకున్నాను! ఇక దానితో యోగసాధనలో కర్మ మార్గం…. ఇద్దరికి సరిపడదని… మేము భక్తి మార్గంలో అడుగు పెట్టినాము! ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే…ఏమి చెయ్యాలో మీకు తెలుసు గదా! 

శుభం భూయాత్

పరమహంస పవనానంద

******************************

గమనిక: కొన్ని సంవత్సరాలకి జిజ్ఞాసి చెప్పిన నగ్నత్వం అనేది స్త్రీ పురుష జననాంగాలకి అతీతమైన దిగంబర తత్వం అని గ్రహించాను! అనగా దిక్కులనే వస్త్రాలు ధరించిన వారిని దిగంబరులు అంటారు! ఈ విశ్వంలో ప్రతి జీవి కూడా ఇలాంటి దిగంబర తత్వంలో ఉండేటట్లుగా ప్రకృతిమాత ఏర్పరచినదని గ్రహించాను! నా తప్పు తెలుసుకున్నాను! 

షిరిడి సాయిబాబా అన్నట్లుగా “ప్రతి స్త్రీ మూర్తి లో బాహ్య సౌందర్యం చూడటము కన్నా దీనిని సృష్టించిన అంతర్యామి ఉండే అంతర సౌందర్యమును ఆ స్త్రీ మూర్తి లో చూడగలిగితే…. వారికి ఆ స్త్రీ మూర్తి బంధనము కాదని ముక్తికాంత అవుతుందని” చెప్పడం జరిగింది! నిజంగా ఎవరైనా ఒక స్త్రీ/పురుష మూర్తిని మనస్ఫూర్తిగా నిజ మైన పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమిస్తే వారికి మిగిలేది అసలుసిసలైన పరిపూర్ణ ఆనంద స్థితి! కానీ మనమంతా శరీర వాంఛతోను, అవసర ప్రేమతోను, ఆర్థిక ప్రేమతోను, ప్రేమించుకోవడం వలన…పైగా స్త్రీమూర్తులను సుఖము ఇచ్చే యంత్రాలుగాను, సంతానమును ఇచ్చే మరయంత్రాలుగాను అలాగే పురుషులను సంపాదన యంత్రాలుగాను చూడటము వలన … క్షణిక సుఖ ప్రాప్తి… ప్రేమగా పంచుకుంటున్నామని నేను గ్రహించాను! అదికాకుండా స్త్రీ/పురుష మాయలో పడితే… తొలిప్రేమ జ్ఞాపకాలు మర్చిపోవటానికి తుదిశ్వాస పడితే...తొలి తొడపరిచయ అనుభవము మర్చిపోవటానికి తొంభై ఏళ్ళు పడుతుందని నా ప్రగాఢ విశ్వాసము! దానితో మా జిజ్ఞాసి కాస్త ఈ విషయములో అరుణాచల నివాసియైన భగవాన్ రమణామహర్షి వారిని ఆదర్శముగా తీసుకొని సాధనకి స్త్రీమూర్తి బంధనంగా, ఆటంకంగా ఏర్పడుతుందని గ్రహించి …. ఆజన్మ బ్రహ్మచారిగా సాధన కొనసాగించాడు! నేనేమో ఈ విషయంలో రామకృష్ణ పరమహంసను స్ఫూర్తిగా తీసుకుని …. ఒక స్త్రీమూర్తిని వివాహం చేసుకుని నాతో పాటుగా ఆమె కూడా పునర్జన్మ లేని స్థితి కలిగించాలని గృహస్థాశ్రమం లోనికి అడుగు పెట్టడం జరిగింది! 

అందుకే తాంత్రిక విధానములో స్త్రీ నగ్నత్వాని చేధించటానికి కామాఖ్య శక్తిపీఠము వద్ద అఘోరాలు,కాపాలుకులు,భైరవులు ఇప్పుడికి యోనిపూజలు(స్త్రీ సాధక గురువు యొక్క యోని) చేస్తూంటారు!తద్వారా నగ్నత్వము నుండి కామత్వమును చేధించి దిగంబరత్వమును అనగా లింగభేదము తెలియని అతీతస్ధితిని పొందడము జరుగుతుంది!అదే స్త్రీ యోగులు అయితే లింగరాధన (పురుష సాధక గురువు పురుషాంగము) చేసి తమకున్న కామత్వమును జయించి దిగంబరులు అవుతారు!ఇది అంతా తేలికయైన సాధన స్ధితి గాదని గ్రహించండి! అనగా పురుష యోగులైతే ఒక నగ్న స్త్రీ శవముతో వరుసగా 41 రోజులపాటు రోజుకి 36 సార్లు సంయోగ ప్రక్రియ చేయాలి! ఆ తర్వాతనే వీరు ఒక సాధక స్త్రీని గురువుగా ఎంచుకొని కామాఖ్య పీఠము వద్ద తనకి దిగంబరతత్వసిద్ధి వచ్చేవరకు ఈమె యోనిపూజ చేస్తూండాలి! దీనికి మించిన మహా నరకము మరొకటి ఉండదని నా అభిప్రాయము!


                  నిజానికి కర్మ మార్గ సాధనము అనేది కర్మ చక్రం మీద ఆధారపడి ఉంటుంది! ఇది కర్మ మీద ఆధారపడి పనిచేస్తుంది! అసలు కర్మ అంటే మదికి పుట్టినది మొదలు….. చచ్చేదాకా చేసే ఏదైనా పనిని కర్మ అవుతుందని నేను గ్రహించాను! కాకపోతే వీటిలో మనకు మేలు చేసే సుకర్మలు, మనకి కీడు చేసే దుష్కర్మలు అనే రెండు రకాల కర్మలు ఉన్నాయని గ్రహించాను! ఈ రెండు కర్మఫలం అనుభవించటానికి జీవుడు కాస్త కర్మ-జన్మ ఎత్తుతాడని… ఒకవేళ వీటిలో ఏదైనా కర్మ ఫలితం మిగిలిపోతే….. నిర్వహించడానికి పునర్జన్మ ఎత్తుతాడని…. ఇట్టి జీవి అనుభవించే కర్మని ప్రారబ్దకర్మ అని అంటారని గ్రహించాను! మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ ప్రారబ్దకర్మ అనుభవిస్తూ…  జీవుడు తనకు తెలిసి తెలియక దుష్కర్మలు అనగా స్వార్థము, కోపము, అత్యాశ, కోప స్వభావము, అసూయ, ద్వేషము పగ, ఆవేశము ఇలాంటి వ్యతిరేక భావాలతో చేసే కర్మల కాస్త… అవి మనకి దుష్కర్మలుగా మారతాయని నేను తెలుసుకున్నాను! అలాగే ఇతరులకు హాని చేయకుండా, మంచి ఆలోచన, నిస్వార్ధముగా, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు సుకర్మలు అని అంటారని నేను గ్రహించాను! ఇలా సుకర్మలు, దుష్కర్మలను కలిపి ఆగామి కర్మలు అంటారని నేను తెలుసుకున్నాను! అంటే మనిషి జన్మ పుట్టటానికి కర్మలు అనగా సుకర్మ పుణ్యము 51 శాతం ఉండాలి అలాగే దుష్కర్మ అనగా పాపము 49% మిగిలిపోతే మళ్లీ దేవుడు కాస్త మనిషి ఇక పునర్జన్మ పుడతాడని గరుడ పురాణం చెబుతోంది! అంటే మనకి ఆగామి కర్మలు అలాగే ప్రారబ్ద కర్మలు కలిపితే సంచిత కర్మ గా వ్యవహరించబడుతుంది! అనగా ఈ కర్మ రాశి అంతా కూడా నాశనం అయ్యే దాకా ప్రతి జీవుడు కూడా పునరపి మరణం… పునరపి జననం తో పున:జన్మలు ఎత్తుతూనే ఉంటాడు! 

మరి ఇలా పునర్జన్మ లేని స్థితి పొందాలి అంటే మనము ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మఫలాలు ఏనాటివో మనకి తెలియదు! వాటి ఫలితాలు ఏమిటో కూడా మనకి తెలియదు కదా! కాబట్టి మనము ఈ జన్మలో వివేక జ్ఞాన బుద్ధితో… ఏది చెడు కర్మ యో తెలుసుకొని… దానిని చేయకుండా జాగ్రత్తపడాలి! అలాగే భగవద్గీతలో చెప్పినట్లు గా ప్రతి కర్మను అనగా అది సుకర్మ అయినా, దుష్కర్మ అయినా కూడా మన ఇష్టదైవానికి అర్పించి… ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా… కర్మ ఫలితం ఆశించకుండా…. వచ్చిన దానితో సంతృప్తి చెంది కలిగితే….  అప్పుడు నువ్వు చేసే కర్మలు కాస్త బంధనాలు కాకుండా బంధ విముక్తి పొందుతారు! తామరాకు మీద ఎలా అయితే నీరు నిలవదో…. అలా మీకున్న అన్ని రకాల కర్మలు నాశనమవడం మొదలవుతాయి! అయితే ఈ కర్మలను మన దైవానికి కర్మ సమర్పణ చేయాలి అన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ ఇష్ట దైవ నామమును మూడుసార్లు స్మరించి “ఓ దేవా! సర్వాంతర్యామి! సర్వేశ్వరా! అంతర్యామి! ఈరోజు నేను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా…. కేవలం నీకోసం నేను చేసే కర్మలు లేదా చేసిన కర్మలు యొక్క కర్మ ఫలాలను అన్నిటినీ నీకు మనసా, వాచా, కర్మణా, మనస్పూర్తిగా, సంపూర్ణ శరణాగతితో సమర్పిస్తున్నాను! దయతో వాటిని స్వీకరించి నన్ను వాటి నుంచి కర్మబంధ విముక్తి గావించు! అని మనసారా ప్రార్థిస్తే చాలు! ఆ రోజు మీ ఖాతాలోనికి ఎలాంటి కర్మలు ఉండవు! వచ్చిన కర్మ బంధనాలు ఉండవు! కర్మ విముక్తి పొందటం ఆరంభమవుతుంది!


కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే।
                                                                                                    —    సాంఖ్య యోగము-భగవద్గీత

కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం మరియు దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, మరియు జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. 

కర్మ (సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది. 

కర్మ సిద్దాంతము ప్రకారము : పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు.

అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు.అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. 

కర్మవాదానికి ఉదాహరణలు:-
పునర్జన్మల పై నమ్మకం, స్వర్గ ప్రాప్తి, నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి. ఉదాహరణ: "నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను" అని కొందరు అంటుంటారు.
ఎన్ని విధాలైన కర్మలు:-
·       సంచిత కర్మ: కర్మ యొక్క మొత్తం
·       ప్రారబ్ధ కర్మ : సంచితం లోనుంచికొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత
·       ఆగామి కర్మ : ప్రారబ్దం వల్ల జరిగే పనులను (మంచి-చెడు) లను నావల్లే జరిగాయని అహన్ని పొందడం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు

భగవద్గీతలో కర్మ:
కర్మ బ్రహ్మోద్భవం. ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి. కర్మలను ఆవరించి దోషం ఉంటుంది. కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలు వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు.
·         కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉంది. అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి. కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి. అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు. గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు ఆ కర్మలలో చిక్కుకోడు. కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా! నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు. కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు. అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి. యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిష్ఠుడిని కర్మలు బంధించలేవు.

బౌద్ధంలో కర్మ
కోరికే కర్మ. ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు. కర్మలు వారసత్వంతోనే పుడతారు.
హిందూ మతంలో కర్మకర్మ అంటే సరి అయిన అర్ధం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే. నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు. హిందూ ధర్మం కర్మ గురించి అనేక విధముల చింతన చేసింది. కర్మ అనేది హింధూ ధర్మంతో అనేక విధముల ముడివడి ఉంటుంది. మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం. మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది. కర్మసిద్ధాంతం ఆత్మతో ముడి పడి ఉంటుంది. హింధూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారం చేసుకుని ఉంటుందని చెప్తుంది. ఆత్మను జీవుడు అని కూడా అంటారు. జీవుడు శరీరంలో ప్రవేశించిన తరువాతే ప్రసవం జరుగుతుంది అని హిందూ మతం చెప్తుంది. కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలిన తరువాత కూడా అతడి వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం, నరకం ద్వారా అనుభవించాలని హిందూ ధర్మం వివరిస్తుంది. పుణ్యం, పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పీపీలికాది అనేక వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది. ప్రళయ కాలంలో కూడా పుణ్య పాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజ రూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది. కాని మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది. కనుక మనిషి కర్మలను ధర్మబద్ధంచేసి సత్కర్మాచరణ చేసి తనను తాను ఉద్దరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం.

కర్మసన్యాస యోగం
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం ఉన్నా దానిని జనసామాన్యానికి ఎక్కువ ఎరుకపరిచింది భగవద్గీత. భగవద్గీతలో కృష్ణభగవానుడు కర్మసన్యాస యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం, కర్మ యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు. జీవులు కర్మ చేయకుండుట ఆసంభవం. జీవుడు చేసిన పుణ్య కర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం, సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని. పాప కర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెడతాడని హిందూ ధర్మం వివరించింది. ఆ కర్మలు క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తుంది. పుణ్యలోకాలు, నరకలోకాలలో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెప్తుంది. మనుష్యలోకంలో ప్రాణులకు పాప, పుణ్య, విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరింవి ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాప పుణ్యాలకు అతీతములు. మానవ జన్మ మాత్రమే పాప పుణ్యకర్మలు మనస్సు యొక్క ప్రకోపంతో చేస్తుంటాడు కనుక మానవ జన్మ పాపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాని ఈ కర్మలను నిశ్శేషంగా చేయడం అసంభవం. పాపము, పుణ్యము ఎక్కువ తక్కువగా జీవుడిని వెన్నాడుతూ ఉంటాయి కనుక కర్మసన్యాస యోగం మనిషి యోగం, తపస్సు, ముని వృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మసన్యాసయోగం ఆచరించి పరమాత్మలో కలసి మోక్షం పొందవచ్చని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎలాగంటే కర్మసన్యాస యోగంద్వారా పాపపుణ్యములను నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు. అందువలన ఆత్మ పరమాత్మలో కలిసి పోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘ కాల ప్రయాణాన్ని ముగించ వచ్చని కర్మసన్యాస యోగం వివరిస్తుంది. కర్మసన్యాస యోగం ఆచరిస్తూ ముక్తి పొందవచ్చన్నది సారాంశం.

కర్మయోగం
"ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపు" అని అర్జునుడు అడిగితే శ్రీ కృష్ణుడన్నాడు:"కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది" అని పలికాడు. అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తుంది. ముక్తి లేక మోక్షం అన్నది హిందూ ధర్మ పరమావధి. కర్మపరిత్యాగం చేసి తపోమార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధనా మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు. పుట్టిన ప్రతి జీవి కర్మచేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు " అర్జునా ! ఉత్తముడు ఏకర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు. ఈ లోకంలో నాకు పొంద తగినది కోరతగినదీ ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మార్గం తెలపడానికి కర్మలను ఆచరిస్తున్నాను " అని చెప్పాడు. యజ్ఞము చేయడం అన్నది కర్మ. కాని యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి దాని ద్వారా వర్షమును పొంది. దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞములో దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు. లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం. కనుక మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది సారాంశం. కర్మ చేయక పోవడం, విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుందన్నది హిందూ ధర్మం వివరిస్తుంది.

కర్మ ఫలం
హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకువెడతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో " కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు " అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అధిగమించవచ్చని హిందూధర్మం బోధిస్తుంది. అంతేగాక భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తుంది.
                         




2 కామెంట్‌లు:

  1. ఈ కపాల మోక్షం గ్రంథం ఒక్కటే నాకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినది.మీ సాధన అనుభవాలు నా ఆధ్యాత్మిక సాధనను క్రొత్త మార్గములో మారేటట్లుగా చేసింది.మీరు చెప్పిన యోగనిద్ర విధివిధాన సాధనతో నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రొత్తగా మొదలుపెట్టాను. మీ సాధన అనుభవాలను ఈ గ్రంథంలో పొందుపరిచి ఒక సాహసవంతమైన సంకల్పం నెరవేర్చి ఒక మార్గ నిర్ధేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు. తద్వారా 'నేను ఉన్నాను' ఉన్న స్థితి నుండి 'నేను లేను' అనే ఉన్నత స్థితికి చేరడమే సాధన పరిసమాప్తి స్థితి అని చెప్పకనే చెప్పారు గదా!

    రిప్లయితొలగించండి
  2. sthri leda purusha maaya gurinchi, aa saadhana vidhi vidhaanaalu, karma gurinchi adi enni vishaalugaa untundi ani baaga vivarinchaaru... nishkaamakarma bagundi...

    రిప్లయితొలగించండి